Vande Bharat Train: సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో మార్పులు.. వివరాలివే..

Secunderabad - Visakhapatnam Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించి షెడ్యూల్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది. రైలు నెం. 20834 సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం నాడు(ఈరోజు) 15.00 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరాల్సి ఉండగా..

Vande Bharat Train: సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో మార్పులు.. వివరాలివే..
కాగా, విజయవాడ-చెన్నై వందేభారత్ రైలుకు మొదట వేరే రూట్ ఎంచుకోగా.. తిరుపతి మీదుగా నడిపితే ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటుందని రైల్వే శాఖ భావించింది. దీంతో వయా రేణిగుంట నడపాలని విజయవాడ డివిజన్ అధికారులు.. దక్షిణ మధ్య రైల్వేను కోరిన విషయం విదితమే.

Updated on: Apr 07, 2023 | 2:09 PM

సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించి షెడ్యూల్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది. రైలు నెం. 20834 సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం నాడు(ఈరోజు) 15.00 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరాల్సి ఉండగా.. షెడ్యూల్ మారింది. ఇదే రోజు అంటే, 07-04-2023 సాయంత్రం 18.15 గంటలకు బయలుదేరేలా రీషెడ్యూల్ చేయడం జరిగింది. ప్రయాణికులు రీషెడ్యూల్‌ను గమనించాల్సిందిగా రైల్వే అధికారులు కోరారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

కాగా, బుధవారం నాడు కూడా విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య వెళ్లనున్న వందే భారత్ రైల్ టైమింగ్స్‌లో మార్పులు చోటు చేసుకుంది. ఉదయం 5.45 గంటలకు బదులు విశాఖలో ట్రైన్ ఉదయం 9.45 గంటలకు బయలుదేరింది. ఖమ్మం-విజయవాడ సెక్షన్ మధ్య కొందరు దుండగులు వందే భారత్ రైలు పై రాళ్ల దాడి చేశారు. దాంతో రైలు S8 కోచ్ గ్లాస్ పగిలిపోయింది. కొత్త గ్లాస్ అమర్చిన తరువాత ట్రైన్ బయలుదేరింది.

ఇవి కూడా చదవండి

గమనిక: మారిన షెడ్యూల్ ఇవాళ ఒక్క రోజుకు మాత్రమే వర్తిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..