భాగ్యనగరంపై మళ్లీ పంజా విసురుతోంది…

హైదరాబాద్ మహానగరంపై మహమ్మారి మళ్లీ ప్రతాపం చూపుతోంది. భాగ్యనగరం మళ్లీ డేంజర్‌ జోన్‌లోకి వెళుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా తగ్గిన..

భాగ్యనగరంపై మళ్లీ పంజా విసురుతోంది...
Follow us

|

Updated on: Aug 30, 2020 | 3:30 PM

హైదరాబాద్ మహానగరంపై మహమ్మారి మళ్లీ ప్రతాపం చూపుతోంది. భాగ్యనగరం మళ్లీ డేంజర్‌ జోన్‌లోకి వెళుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా తగ్గిన కాలుష్యం ఇప్పుడు అనూహ్యంగా పెరిగిపోయింది. హైదరాబాద్‌లో కాలుష్యం ఢిల్లీతో పోటీ పడుతోందని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది.

మోటార్‌ వాహనాల ద్వారా హైదరాబాద్‌లో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. వాహనాల నుంచి వెలువడే నైట్రోజన్‌ డయాక్సైడ్‌ కాలుష్యంతో వాతావరణశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో 77 శాతం వాయు కాలుష్యం పెరిగితే, ఢిల్లీలో 49 శాతం, హైదరాబాద్‌లో 40 శాతం, బెంగళూరులో 38 శాతం వాయుకాలుష్యం పెరిగిందని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది.

మార్చి 22 నుంచి మే మూడో వారం వరకు లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌లో వాయు కాలుష్యం భారీగా తగ్గిపోయింది. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాక, రోడ్ల మీదకి మళ్లీ వాహనాల రాక మొదలైంది. దీంతో వాయు కాలుష్యం పెరిగిపోయింది. లాక్‌డౌన్‌లో హైదరాబాద్‌ నుంచి సొంత ఊర్లకు వెళ్లినవారు తిరిగి వచ్చారని, ఆ తర్వాత రోడ్ల మీదకి యధావిధిగా వాహనాలు రావడంతో వాయు కాలుష్యం పెరిగిపోయిందని నగరవాసులు చెబుతున్నారు. అయితే వైరస్‌పై అలర్ట్‌గా ఉండాలని, అత్యవసరం అయితేనే తప్ప బయటకి రాకుండా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, కరోనా వైరస్‌ వల్ల చాలా మంది సొంత వాహనాల్లో ప్రయాణం చేయడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని కొందరు స్థానికులు భావిస్తున్నారు.

మార్చి 27 నుంచి మే 17 వరకు వాయు కాలుష్యం తగ్గిందని, ఇప్పుడు మళ్లీ పెరిగిందంటున్నారు తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అధికారులు. అయితే మిగతా నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో వాయు కాలుష్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ప్రతి పౌరుడు స్వీయ నియంత్రణ పాటించినప్పుడే వైరస్‌తో పాటు ఇటు వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని సూచించారు.

Latest Articles
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం-16 ఎందుకు అవసరం? లేకపోతే ఏమి చేయాలి?
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం-16 ఎందుకు అవసరం? లేకపోతే ఏమి చేయాలి?
రూ. 79,998విలువైన ఫోన్.. కేవలం రూ. 15వేలకే సొంతం చేసుకోండి..
రూ. 79,998విలువైన ఫోన్.. కేవలం రూ. 15వేలకే సొంతం చేసుకోండి..
మీరు వాడుతోన్న నెయ్యి అసలా.? నకిలీనా.? ఇలా తెలుసుకోండి..
మీరు వాడుతోన్న నెయ్యి అసలా.? నకిలీనా.? ఇలా తెలుసుకోండి..
ఎండల ఎఫెక్ట్‌.. ఒకే రోజులో 2 టన్నుల చేపలు మృత్యువాత
ఎండల ఎఫెక్ట్‌.. ఒకే రోజులో 2 టన్నుల చేపలు మృత్యువాత
లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం
లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం
అమృతం కన్నా ఎక్కువ ఈ నీరు.. డైలీ ఓ గ్లాసు తాగితే ఆ సమస్యలే ఉండవు
అమృతం కన్నా ఎక్కువ ఈ నీరు.. డైలీ ఓ గ్లాసు తాగితే ఆ సమస్యలే ఉండవు
30 రోజుల చెల్లుబాటుతో జియో సూపర్‌హిట్ ప్లాన్..
30 రోజుల చెల్లుబాటుతో జియో సూపర్‌హిట్ ప్లాన్..
భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. అసలు ఉద్దేశం అదేనా.?
భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. అసలు ఉద్దేశం అదేనా.?
ప్రేయసికి రూ. 80 లక్షలు ఇచ్చిన ప్రియుడు.. డిపాజిట్ చేద్దామని..
ప్రేయసికి రూ. 80 లక్షలు ఇచ్చిన ప్రియుడు.. డిపాజిట్ చేద్దామని..
ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..
ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..