ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. నందిగామ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావుకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది
Another MLA tests positive: ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. నందిగామ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావుకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఫలితాల్లో పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారు పరీక్ష చేయించుకోవాలని ఆయన కోరారు. అలాగే వారు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, పరామర్శించడానికి తనకు కొద్ది రోజుల పాటు ఎవరూ ఫోన్ చేయొద్దని ఆయన విఙ్ఞప్తి చేశారు. అలాగే కలవడానికి కూడా ప్రయత్నించొద్దని తెలిపారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని ఎమ్మెల్యే వెల్లడించారు.
Read More:
చిరు ‘ఆచార్య’ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్లనుందంటే..!