చిరు ‘ఆచార్య’ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్లనుందంటే..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మోస్ట్‌ అప్‌కమింగ్ మూవీ ఆచార్య. హిట్ దర్శకుడు కొరటాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు

చిరు 'ఆచార్య' సెట్స్ పైకి ఎప్పుడు వెళ్లనుందంటే..!
Follow us

| Edited By:

Updated on: Sep 21, 2020 | 5:07 PM

Chiranjeevi Acharya movie: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మోస్ట్‌ అప్‌కమింగ్ మూవీ ఆచార్య. హిట్ దర్శకుడు కొరటాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామాజిక కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీ చిత్రీకరణ 30 శాతం పూర్తి అయ్యింది. అయితే కరోనా లాక్‌డౌన్‌తో ఈ చిత్ర షూటింగ్‌కి బ్రేక్ పడగా.. మళ్లీ ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూవీ యూనిట్‌ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్‌లో ఆచార్యను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మామూలుగా మూవీ షూటింగ్‌లకు జూన్‌లోనే అనుమతులు లభించగా.. అప్పుడే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చిరు టీమ్ భావించింది. అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో షూటింగ్‌ ప్లాన్‌ని విరమించుకున్నారు. ఇక ఇప్పుడు కేసుల సంఖ్య తగ్గుతూ ఉండటంతో మళ్లీ చిత్రీకరణను ప్రారంభించాలని అనుకుంటున్నారట. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ మరోసారి నటిస్తున్నారు. రామ్ చరణ్‌ కీలక పాత్రలో నటిస్తుండగా.. సోనూసూద్‌, అజయ్‌, హిమజ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

Read more:

సీనియర్ నటి సీత కన్నుమూత

‘అంధాధున్’ రీమేక్‌.. తమన్నాకు క్రేజీ రెమ్యునరేషన్‌..!