ఫలించిన ప్రార్థనలు.. జషిత్ క్షేమం
గత నాలుగు రోజులుగా అందరూ చేస్తోన్న ప్రార్థనలు ఫలించాయి. చిన్నారి జషిత్ క్షేమంగా ఉన్నాడు. తూర్పు గోదావరి జిల్లా కుతుకులూరు రోడ్లో జషిత్ను కిడ్నాపర్లు వదిలేసి వెళ్లారు. చింతాలమ్మ గుడి దగ్గర జషిత్ను గుర్తించిన కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు జషిత్ను తీసుకొని.. అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా నాలుగు రోజుల క్రితం మండపేటలో జషిత్ కిడ్నాప్కు గురయ్యాడు. సోమవారం రాత్రి 7గంటలకు కరెంట్ పోయిన సమయంలో గుర్తు తెలియని కొందరు […]
గత నాలుగు రోజులుగా అందరూ చేస్తోన్న ప్రార్థనలు ఫలించాయి. చిన్నారి జషిత్ క్షేమంగా ఉన్నాడు. తూర్పు గోదావరి జిల్లా కుతుకులూరు రోడ్లో జషిత్ను కిడ్నాపర్లు వదిలేసి వెళ్లారు. చింతాలమ్మ గుడి దగ్గర జషిత్ను గుర్తించిన కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు జషిత్ను తీసుకొని.. అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా నాలుగు రోజుల క్రితం మండపేటలో జషిత్ కిడ్నాప్కు గురయ్యాడు.
సోమవారం రాత్రి 7గంటలకు కరెంట్ పోయిన సమయంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు జషిత్ను ఎత్తుకెళ్లారు. అయితే వారి నుంచి ఎలాంటి డిమాండ్ రాకపోవడంతో తల్లిదండ్రులతో పాటు అందరిలో ఆందోళన మొదలైంది. బాలుడి కోసం పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలించారు. ఇక ఇప్పుడు జషిత్ క్షేమంగా ఉండటంతో తల్లిదండ్రులు, బంధువులు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు. దేవుడు తమ మొర ఆలకించాడంటూ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.