AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ చేప చిక్కింది.. దెబ్బకు దరిద్రం వదిలింది

మత్స్యకారుల పంట పడింది. సముద్రంలోవేటకు వెళ్లిన వారి వలలకు భారీ కొమ్ము కోనాం చిక్కింది. కాకినాడ పోర్టు ఏరియా కుంభాభిషేకం సముద్రపు రేవులో మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి....

భారీ చేప చిక్కింది.. దెబ్బకు దరిద్రం వదిలింది
Sanjay Kasula
|

Updated on: Jun 04, 2020 | 10:52 AM

Share

మత్స్యకారుల పంట పడింది. సముద్రంలో వేటకు వెళ్లిన వారి వలలకు భారీ కొమ్ము కోనాం చిక్కింది. కాకినాడ పోర్టు ఏరియా కుంభాభిషేకం సముద్రపు రేవులో మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి. చాలా రోజుల విరామం తర్వాత వేట ప్రారంభించిన మత్స్యకారుల వలకు రెండు భారీ చేపలు దొరికాయి. వీటిని చూసేందుకు జనం ఆసక్తి చూపించారు.

వీటిని బోటు నుంచి పైకి తీసుకు వచ్చిన మత్స్యకారులు వాటి బరువును చూసి ముక్కున వేలేసుకున్నారు. ఒక చేప సుమారు 125 కేజీల బరువుండగా.. మరో చేప 115 కేజీల బరువు ఉండవచ్చని మత్స్యకారులు చెబుతున్నారు. గతంలో ఇంత పెద్ద చేపలను చూడలేదని మత్స్యకారులు అంటున్నారు. ఈ చేపలను కొమ్ము కోనాం అని పిలుస్తారని తెలిపారు. కొమ్ము కోనాంకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉందని అంటున్నారు. దీని ధర సుమారు రూ. 500 నుంచి రూ. 800 వరకు పలుకుతుందని ఆనందం వ్యక్తం చేశారు కాకినాడ రైతులు.