AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ప్రమాదం.. ఒక్కొక్కటిగా బయటపడుతోన్న కొత్త కోణాలు..

Visakhapatnam Fishing Harbour: మరోవైపు ఈ సంఘటనతో.. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ సెక్యూరిటీలో డొల్లతనం బయటపడింది. సీసీ కెమెరాలు పనిచేయట్లేదని పోలీసులు గుర్తించారు. బోట్లు తగులబెట్టింది బయటి వ్యక్తులేనని అనుమానిస్తున్నారు. భద్రతా లోపాల గురించి ఎన్నిసార్లు మొత్తుకున్నా అధికారులు పట్టించుకోవట్లేదని మత్స్యకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో సెక్యూరిటీని పెంచాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదంటూ మత్స్యకారులు వాపోతున్నారు.

Andhra Pradesh: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ప్రమాదం.. ఒక్కొక్కటిగా బయటపడుతోన్న కొత్త కోణాలు..
Fishing Harbour
Venkata Chari
|

Updated on: Nov 21, 2023 | 9:22 PM

Share

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాద స్థలం‌లో పార్టీ జరిగినట్లు ఆధారాలు గుర్తించారు. ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదట యూట్యూబర్ నానిపై అనుమానాలు వచ్చాయి. అయితే, అతగాడి ప్రమేయానికి సంబంధించి ఆధారాలు దొరకకపోవడంతో ఇతర కోణాల్లో విచారిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్, గంజాయి మాఫియాలపైన అనుమానం వ్యక్తం అవుతుండడంతో ఆ దిశగా కూడా దర్యాప్తు జరుగుతోంది.

ఇక హార్బర్‌ సమీపంలోనే పెట్రో నిల్వలు చేసే సంస్థలు, ఈస్టర్న్ నేవీ, షిప్ బిల్డింగ్ యూనిట్స్, కంటైనర్ కార్పొరేషన్ లాంటి సంస్థలు ఉండడంతో, ఫిషింగ్‌ హార్బర్‌ భద్రతపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ సంఘటను సంబంధించి ఇప్పటివరకు నిందితులను గుర్తించలేకపోవడాన్ని రాజకీయ పార్టీలు తప్పు పడుతున్నాయి. దీంతో విశాఖ పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ప్రమాదంలో 35 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా, 9 బోట్లు పాక్షికంగా కాలిపోయాయి. మొత్తం 20 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఈ సంఘటనతో.. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ సెక్యూరిటీలో డొల్లతనం బయటపడింది. సీసీ కెమెరాలు పనిచేయట్లేదని పోలీసులు గుర్తించారు. బోట్లు తగులబెట్టింది బయటి వ్యక్తులేనని అనుమానిస్తున్నారు. భద్రతా లోపాల గురించి ఎన్నిసార్లు మొత్తుకున్నా అధికారులు పట్టించుకోవట్లేదని మత్స్యకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో సెక్యూరిటీని పెంచాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదంటూ మత్స్యకారులు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

హార్బర్‌లో పోలీస్‌ ఔట్‌ పోస్ట్ ఏర్పాటు చేస్తే పరిస్థితి మెరుగ్గా ఉంటుందని చెప్పినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఫిషింగ్‌ హార్బర్‌లోకి ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో తెలియదంటున్నారు వాళ్లు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..