AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆవేశంలో భార్య కాళ్లు నరికేశాడు

విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం లింగాలపాడు గ్రామంలో ఒక భర్త తన భార్య కాళ్లు నరికేశాడు. అయితే అతని కోపానికి కారణం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గేదె విషయంలో భార్యా భర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. మంగళవారం రాత్రి పిచ్చయ్య ఇంటికి రాగానే భార్యాభర్తల మధ్య గేదెను అమ్మే విషయంలో వివాదం జరిగింది. అది కాస్త పెరిగి, పెరిగి పెద్దదిగా మారింది. ఈ క్రమంలో భర్త పిచ్చయ్య గొడ్డలితో భార్య రాజేశ్వరి కాళ్లను నరికేశాడు. బాధితురాలు […]

ఆవేశంలో భార్య కాళ్లు నరికేశాడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 13, 2019 | 9:10 PM

Share

విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం లింగాలపాడు గ్రామంలో ఒక భర్త తన భార్య కాళ్లు నరికేశాడు. అయితే అతని కోపానికి కారణం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గేదె విషయంలో భార్యా భర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. మంగళవారం రాత్రి పిచ్చయ్య ఇంటికి రాగానే భార్యాభర్తల మధ్య గేదెను అమ్మే విషయంలో వివాదం జరిగింది. అది కాస్త పెరిగి, పెరిగి పెద్దదిగా మారింది.

ఈ క్రమంలో భర్త పిచ్చయ్య గొడ్డలితో భార్య రాజేశ్వరి కాళ్లను నరికేశాడు. బాధితురాలు ప్రస్తుతం నందిగామలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తమ తల్లిదండ్రులిద్దరూ ఎప్పుడూ సఖ్యతతో లేరని.. ఇద్దరి మధ్య ఎప్పుడూ ఏవో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయని వారి కుమార్తె తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.