AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పసికందు ఏమైంది..?

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతా శిశు రక్షణ కేంద్రంలో పసికందు అదృశ్యం అయిన ఘటన కలకలం రేపింది. సంగారెడ్డి మండలం కులబ్‌గూర్‌కు చెందిన మాధవికి గత నెల 30న అక్కడి మాతా శిశు కేంద్రంలో డెలివరీ అయింది. డిశ్చార్జ్ అయిన తర్వాత చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో గత శుక్రవారం తిరిగి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఫొటో థెరపీలో భాగంగా చిన్నారికి చికిత్స కొనసాగుతుండగా.. ఈ లోపు ఓ గుర్తు తెలియని మహిళ 8 రోజుల వయసున్న పసికందును […]

ఆ పసికందు ఏమైంది..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 08, 2019 | 12:38 PM

Share

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతా శిశు రక్షణ కేంద్రంలో పసికందు అదృశ్యం అయిన ఘటన కలకలం రేపింది. సంగారెడ్డి మండలం కులబ్‌గూర్‌కు చెందిన మాధవికి గత నెల 30న అక్కడి మాతా శిశు కేంద్రంలో డెలివరీ అయింది. డిశ్చార్జ్ అయిన తర్వాత చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో గత శుక్రవారం తిరిగి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఫొటో థెరపీలో భాగంగా చిన్నారికి చికిత్స కొనసాగుతుండగా.. ఈ లోపు ఓ గుర్తు తెలియని మహిళ 8 రోజుల వయసున్న పసికందును ఎత్తుకెళ్లింది. దీంతో.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ పాపను ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

చిన్నారి మిస్సింగ్‌పై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీలను పరిశీలించారు. అయితే.. సీసీటీవీ ఫుటేజ్‌లో ఎలాంటి వివరాలు, ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు. త్వరలోనే చిన్నారి ఆచూకీని కనిపెడతామని చెప్తున్నారు పోలీసులు.

Follow Us