Passenger Train: విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మృతులు పెరిగే అవకాశం

ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. పట్టాలు తప్పడం, ఢీకొనడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఏపీలోని విశాఖ - రాయగడ ప్యాసింజర్‌ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. అలమండ రైల్వే స్టేషన్‌ సమీపంలోని కంటకాపల్లి దగ్గర ఈ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద చోటు

Passenger Train: విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మృతులు పెరిగే అవకాశం
Train Accident

Updated on: Oct 29, 2023 | 9:03 PM

ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. పట్టాలు తప్పడం, ఢీకొనడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఏపీలోని విశాఖ – రాయగడ ప్యాసింజర్‌ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. అలమండ రైల్వే స్టేషన్‌ సమీపంలోని కంటకాపల్లి దగ్గర ఈ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద చోటు చేసుకుంది. ఓవర్‌హెడ్‌ కేబుల్‌ తెగిపోవడంతో నిలిచిపోయిన ప్యాసింజర్‌ రైలును పలాస-విశాఖ రైలు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మూడు బోగిలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని వాల్తేరు డీఆర్‌ఎం సౌరబ్‌ ప్రసాద్‌ టీవీ9తో తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అన్నారు.

అయితే ట్రైన్‌ ఇంజన్‌ నుంచి విడిపోయి నాలుగు బోగీలు పరస్పరం ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటన ప్రాంతంలో అంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు అటంకం ఏర్పడుతోందని వాల్తేరు డీఆర్‌ఎం తెలిపారు. పూర్తిగా చీకటిగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఈ వార్త అప్‌డేట్‌లో ఉంది..