Andhra Pradesh: ఏపీలో ఆ ప్రాంతాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు

ఏపీలో కూటమి సర్కార్‌ కొలువుదీరబోతోంది. జూన్‌ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార చేయనున్నారు. ఇదిలా ఉండగా, మంగళవారం విజయవాడలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీడీఎల్పీ నేతగా చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు...

Andhra Pradesh: ఏపీలో ఆ ప్రాంతాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు
Chandrababu Naidu
Follow us

|

Updated on: Jun 11, 2024 | 12:15 PM

ఏపీలో కూటమి సర్కార్‌ కొలువుదీరబోతోంది. జూన్‌ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార చేయనున్నారు. ఇదిలా ఉండగా, మంగళవారం విజయవాడలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీడీఎల్పీ నేతగా చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అలాగే విశాఖను ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని, కర్నూలును కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఏపీ ప్రజలు గతంలో ఎప్పుడూ ఇవ్వని తీర్పునిచ్చారని, ఏపీ ప్రజలు ఐదేళ్లు విధ్వంసకర పాలన చూశారని, అత్యున్నత ఆశయాల కోసం 3 పార్టీలు ఏకమయ్యాయని అన్నారు.

1994లో ఏకపక్ష ఎన్నికలు జరిగినా ఇన్ని సీట్లు రాలేదని, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కడపలో 7కు 5 సీట్లు గెలిచాం.. అభ్యర్థులు గట్టిగా నిలబడ్డ చోట ప్రజలు ఆశీర్వదించారు.. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఢిల్లీలో మమ్మల్ని గౌరవించారని చంద్రబాబు అన్నారు. ఈ తీర్పుతో రాష్ట్ర గౌరవం పెరిగింది.. గెలిచే అభ్యర్థులకే సీట్లు కేటాయించాం.. టీడీపీ, జనసేన పొత్తు గురించి తొలిసారి చెప్పిన వ్యక్తి పవన్ అని గుర్తు చేశారు చంద్రబాబు.

ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. గత ఐదేళ్లు ఏపీ ప్రజలు విపత్కర పరిస్థితులు చూశారని, ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం దేశానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. కూటమి అంటే ఎలా ఉండాలో ఏపీ ప్రజలు దేశానికి చూపించారన్నారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, కావల్సిన చోట తగ్గాం.. 5 కోట్ల మంది ప్రజలు మనపై ఆశలు పెట్టుకున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడు కావాలని, ఈ సమయంలో చంద్రబాబు నాయకత్వం, అనుభవం చాలా అవసరం అని పవన్‌ అన్నారు. మందుపాతరలు పేలినా బయటపడ్డ నాయకుడు చంద్రబాబు.. ఎన్డీఏ కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబును ప్రతిపాదిస్తున్నామని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

ఇక పురంధేవ్వరి మాట్లాడుతూ.. కూటమిగా అనూహ్య విజయం సాధించాం.. 3 పార్టీల కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. గత ఐదేళ్లుగా నిజమైన సంక్షేమానికి ప్రజలు దూరమయ్యారు. ఇంతటి ఘన విజయం మనం ఊహించలేదని అన్నారు. మూడు పార్టీల కలయిక రాష్ట్రానికి అవసరమని ప్రజలు భావించారని ఆమె గుర్తు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!