Air Quality: ఢిల్లీ బాటలో ఏపీలోని ఆ నగరం.. ప్రమాదకర స్థాయికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. ఎంతుందంటే?

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ఏ స్థాయికి చేరిందే అందరికీ తెలుసు.. ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితే మన తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపింస్తుంది. తెలంగాణలోని హైదరాబాద్, ఏపీలోని విజయవాడలో కూడా గాలి నాణ్యత రోజురోజుకు పడిపోతుంది. నగరాల్లో ఎక్కడ చూసిన ఎత్తైన భవనాలు తప్ప.. పచ్చదనం కనిపించట్లేదు.. దీంతో గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గి కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు విజయవాడలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎలా ఉందో చూద్దాం పదండి.

Air Quality: ఢిల్లీ బాటలో ఏపీలోని ఆ నగరం.. ప్రమాదకర స్థాయికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. ఎంతుందంటే?
Air Quality Crisis

Edited By: Anand T

Updated on: Dec 01, 2025 | 11:46 AM

విజయవాడలో ఆక్సిజన్ కొరత రోజు రోజుకి పెరుగుతుంది.. ఎటువైపు చూసిన ఎత్తైన భవనాలు కనిపిస్తున్నాయి.. కానీ పచ్చదనం మాత్రం కనుమరుగయ్యింది. దానికి తోడు వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ విషయవాయువులతో గాలి కాలుష్యం కూడా పెరుగుతుంది. విజయవాడలో ప్రస్తుతం సాధారణంగా 100 ఉండాల్సిన ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ 157 చేరుకుంది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో పెద్ద సమస్యగా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. 2012లో నగరంలో 1.38 లక్షల చెట్లు ఉండటం ఒక రికార్డ్‌గా నమోదైంది . కానీ 2016లో టిడిపి ప్రభుత్వం హయాంలో అనేక చెట్లు తొలగించబడ్డాయి. ఈ సమయంలోనే చెట్ల సంఖ్యను పెంచడం కోసం కొన్ని చర్యలను చేపట్టారు.. కానీ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రణాళిక ఆగిపోయింది.

విజయవాడకు 2016లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి ఉన్న నగరాల్లో.. మూడో స్థానం లభించింది. ఒక చదరపు కిలోమీటర్ కు 31,000 మంది ఉన్నప్పుడు 15 లక్షల జనాభా కు కేవలం లక్ష చెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ విషయం ప్రకారం ఆక్సిజన్ కోసం ఎంత తీవ్రతను అనుభవిస్తున్నామో స్పష్టంగా అర్థమవుతుంది. విజయవాడలో వేసవి కాలం వచ్చిందంటే 40 నుంచి 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిలో చెట్ల కొరత వలన వేడి మరింతగా పెరుగుతుంది. ఆక్సిజన్ స్థాయిలు కూడా తగ్గిపోతున్నాయి. చెట్లు లేకపోవడం వల్లన కాలుష్యము పెరిగిపోయింది.

1987లో జంధ్యాల శంకర్ అప్పటి మేయర్ చెట్లు పెంచేందుకు హెలికాప్టర్ ద్వారా విత్తనాలను చల్లారు.. ఈ ప్రక్రియ వల్ల మంచి ఫలితాలు వచ్చాయి.. ఇప్పుడు నగరపాలక సంస్థ మళ్ళీ ప్రతి ఏడాదికి 20 నుంచి 50 వేల మొక్కలు నాటాలని ప్రణాళికలు చేపట్టింది. చెట్ల పెంచడం ప్రజలలో అవగాహన కల్పించడం చాలా అవసరం అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రోత్సహిస్తున్నారు. వాతావరణం మార్పులను చెట్ల పెంపకం ద్వారా అడ్డుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.