TTD: తిరుపతి అలిపిరి నడక మార్గంలో బోనులో చిక్కిన చిరుతలకు విముక్తి.. అడవిలో వదిలిన అధికారులు

తిరుమల నడక మార్గంలో అలజడి సృష్టించిన చిరుతలను బంధించిన అటవీ శాఖ ఎట్టకేలకు విముక్తి కల్పించింది. దాదాపు 3 నెలలుగా అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల్లో భయాన్ని కలిగించిన చిరుతలను బందించే ప్రయత్నం చేస్తున్న విశాఖ ఇప్పటికీ ఆపరేషన్ చిరుత కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే జూన్ 24 నుంచి ఇప్పటిదాకా 5 చిరుతలను బంధించింది..

TTD: తిరుపతి అలిపిరి నడక మార్గంలో బోనులో చిక్కిన చిరుతలకు విముక్తి.. అడవిలో వదిలిన అధికారులు
Leopards

Edited By:

Updated on: Sep 19, 2023 | 10:27 AM

తిరుపతి, సెప్టెంబర్‌ 19: తిరుమల నడక మార్గంలో అలజడి సృష్టించిన చిరుతలను బంధించిన అటవీ శాఖ ఎట్టకేలకు విముక్తి కల్పించింది. దాదాపు 3 నెలలుగా అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల్లో భయాన్ని కలిగించిన చిరుతలను బందించే ప్రయత్నం చేస్తున్న విశాఖ ఇప్పటికీ ఆపరేషన్ చిరుత కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే జూన్ 24 నుంచి ఇప్పటిదాకా 5 చిరుతలను బంధించింది.

కౌశిక్ పై దాడి, ఆగస్టు 11న లక్షితపై దాడి చేసి చంపిన చిరుతను గుర్తించేందుకు ఆపరేషన్ చిరుత చేపట్టిన అటివిశాఖ నడక మార్గానికి దగ్గరగా సంచరించే చిరుతలను బోన్లు ఏర్పాటు చేసి బంధిస్తూనే ఉంది. ఇప్పటిదాకా 5 చిరుతలను బంధిస్తే ఇందులో అతనికి చిరుతను జూన్ 24 నే తిరుపతికి దగ్గరగానే చామల రేంజ్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ వదిలిపెట్టింది. ఆ తరువాత పట్టుబడ్డ నాలుగు చిరుతల్లో రెండింటికి ఎస్వి జూ పార్క్ నుంచి విముక్తి కల్పించింది. లక్షితపై దాడి చేసిన చిరుతలు ఈ రెండూ కాదని నిర్ధారించుకున్నాకే ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 11న నడక మార్గంలో లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ టీం ప్రయత్నిస్తోంది. ఐసర్ సైంటిస్ట్ డాక్టర్ నందిని సేకరించిన నమూనాలు పరిశోధన తరువాత ఈ నెల 13 న నివేదిక వచ్చింది. రిపోర్ట్ ఆధారంగా బంధించిన చిరుతలు మాన్ ఈటర్స్ కాదని గుర్తించడంతో అటవీశాఖ అధికారులు వాటిని పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

గత నెల 14న, 17న బంధించిన రెండు చిరుతల నమూనాలు, లక్షిత డెడ్ బాడీ వద్ద సేకరించిన నమూనాలతో పోల్చి లక్షితపై దాడి చేసిన చిరుతలు ఈ రెండూ కాదని తేల్చిన నివేదిక ఆధారంగా ఈ మేరకు నిర్ణయించారు. దీంతో తిరుపతి ఎస్ వి జూ నుంచి రెండు చిరుతలను తరలించారు. ఏపీ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతితో ఒక చిరుతను తిరుపతికి 350 కిలోమీటర్ల దూరంలో గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలో అటవీశాఖ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకునివదిలి పెట్టింది.

ఇవి కూడా చదవండి

మరో చిరుతను విశాఖపట్నం ఇందిరా గాంధీ జూ పార్క్ కు తరలించింది. ఇంకా జూలో 4, 5 చిరుతలు ఉండగా వాటి నమూనా లకు సంబంధించి రిపోర్టులు వచ్చాక నిర్ణయం తీసుకోనున్నారు అటవీశాఖ అధికారులు. మరోవైపు ఇంకా తిరుమల నడకమార్గాలు, తిరుమల పరిసరాల్లో 5 చిరుతలు ఉన్నట్లు ట్రాప్ కెమెరా ఇమేజెస్ ద్వారా గుర్తించిన అటవీశాఖ క్లోజ్ మానిటరింగ్ చేస్తోంది. నిన్న రాత్రి కూడా మొదటి ఘాట్ రోడ్డు, ఎస్వీ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత సంచారంపై పుకార్లు రావడంతో అటవీ శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us