ఎండాకాలంలో చల్లటి మంచుతెరతో భక్తులను ఆహ్వానిస్తున్న తిరుమల వెంకటేషుడు..
రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేళ తిరుమలలో మాత్రం పొగమంచు మేఘాల సందడి భక్తులను ఆకట్టుకుంటోంది. శేషాచలం కొండలపై తేలియాడే మేఘాలు, ఘాట్ రోడ్లపై కమ్ముకున్న మంచు తెరలు ప్రకృతి సోయగాలను మరింత అందంగా చూపిస్తున్నాయి. ఆ దృశ్యాలను మేం మీ కోసం తీసుకొచ్చాం ...
రాష్ట్రంలో ఎండలు నిప్పులు చెరిగేలా ఉన్న వేళ.. తిరుమలలో మాత్రం చల్లని మేఘాల సందడి భక్తులను ఆకట్టుకుంటోంది. కొండలను తాకుతూ సాగే పొగమంచు మేఘాలు వెంకటేశ్వరుడి పర్వతాలకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.
వేసవి మధ్యలో శేషాచలం కొండల్లో కనిపిస్తున్న ఈ చల్లని వాతావరణం భక్తులను పరవశింపజేస్తోంది. పాలకడలి తరలివచ్చినట్టుగా పొగమంచు మేఘాలు కొండలపై కదులుతూ అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. మంచు తెరల మధ్య దర్శనమిచ్చే శ్రీవారి ఆలయం మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఘాట్ రోడ్లపై కమ్ముకున్న పొగమంచు తెరలు చూసేందుకు భక్తులు వాహనాలు ఆపి ఆస్వాదిస్తున్నారు. ఫోటోలు తీసుకుంటూ ఆ క్షణాలను మధురంగా మలుచుకుంటున్నారు.
ఒకవైపు పచ్చని కొండలపై తేలియాడే మేఘాలు.. మరోవైపు లోయలపై పరుచుకున్న పొగమంచు.. ప్రకృతి సోయగాల కలయికగా ఈ దృశ్యం నిలుస్తోంది. తిరుమలలో కనిపిస్తున్న ఈ వాతావరణం భక్తులతో పాటు ప్రకృతి ప్రేమికులను కూడా మంత్ర ముగ్ధులను చేస్తోంది.
క్యాన్సర్ను ఎదిరించి.. CBSE టెన్త్లో టాపర్గా నిలిచి..
రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్ ప్లాన్ అదిరిందిగా
ఒక్కరోజు వయసున్న క్యూట్ 'రైనో'.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో
ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా
పెట్రోల్ బంకుల్లో ఎయిర్ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్
పూజారి ఇంట్లో అద్భుతం.. సీతారాముల చెంత నాగేంద్రుడు ప్రత్యక్షం
విద్యుత్ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్.. కారణం ఇదే

