AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఉత్కంఠ రేపుతున్న అన్నా క్యాంటీన్ వివాదం.. ఆసక్తిగా మారుతున్న అధికారుల తీరు.. నెక్స్ట్ ఏంటో..

గుంటూరు జిల్లా తెనాలిలో (Tenali) అన్నా క్యాంటీన్ వివాదం తీవ్ర ఉద్రిక్తత రేపుతోంది. మున్సిపల్ సిబ్బంది ఇచ్చిన నోటీసులనూ లెక్క చేయకుండా టీడీపీ నేతలు క్యాంటీన్‌ను యథావిధిగా నిర్వహించారు. మార్కెట్ సమీపంలోని ఎన్టీఆర్...

Andhra Pradesh: ఉత్కంఠ రేపుతున్న అన్నా క్యాంటీన్ వివాదం.. ఆసక్తిగా మారుతున్న అధికారుల తీరు.. నెక్స్ట్ ఏంటో..
Anna Canteen
Ganesh Mudavath
|

Updated on: Sep 03, 2022 | 9:28 AM

Share

గుంటూరు జిల్లా తెనాలిలో (Tenali) అన్నా క్యాంటీన్ వివాదం తీవ్ర ఉద్రిక్తత రేపుతోంది. మున్సిపల్ సిబ్బంది ఇచ్చిన నోటీసులనూ లెక్క చేయకుండా టీడీపీ నేతలు క్యాంటీన్‌ను యథావిధిగా నిర్వహించారు. మార్కెట్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర రోజులాగే క్యాంటిన్‌ నడిపించారు. క్యాంటిన్ ఎత్తివేయాలంటూ మున్సిపల్ అధికారులు వస్తారని భావించిన టీడీపీ (TDP) శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం అటు వైపు రాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా భోజనం అందించారు. 20 రోజులుగా మార్కెట్ సెంటర్‌లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నడుస్తోంది. పేదలకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆల్ ఆఫ్‌ సడెన్‌గా మున్సిపల్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని, అన్నా క్యాంటీన్‌ను మరో చోటికి మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదూ నోటీసులు కూడా ఇచ్చారు. అయితే టీడీపీ నేతలు మాత్రం అన్నా క్యాంటిన్‌ను తరలించేదే లేదని తెగేసి చెప్పారు. అంతటితో ఆగకుండా నోటీసులను బేఖాతరు చేస్తూ క్యాంటీన్ నిర్వహించారు.

కాగా.. గతంలో టీడీపీ, మునిసిపల్ అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే మధ్యాహ్నం కేవలం ఒక గంట వ్యవధిలోపే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ తీసేయమనడం దారుణమని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ పై వివక్ష తగదని సూచిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య శుక్రవారం అన్నా క్యాంటీన్ సజావుగా నడవడంపై మున్సిపల్ అధికారులు వెనక్కి తగ్గినట్టేనా? ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించారా? లేదంటే మరో అస్త్రంతో ముందుకొస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ నేతలు మాత్రం అన్నా క్యాంటీన్‌ అడ్డా మార్చబోమని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం