
‘వాళ్లు చేసిన నేరమేంటి’? సింగిల్ పాయింట్ క్వశ్చన్తో గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రశ్నించారు వైఎస్ జగన్. అసలు ఇదంతా జరిగింది.. తిరుమల నెయ్యి వ్యవహారం నుంచే అంటూ మొదలుపెట్టారు జగన్. నెయ్యిలో జంతువుల కొవ్వే కలవలేదని సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి.. చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారానికి దిగి.. పరిస్థితిని దాడులు, కేసులు, అరెస్టుల దాకా తెచ్చారని ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ కామెంట్స్కు టీడీపీ కౌంటర్ యాక్షన్కు దిగింది. కులాలు, మతాల పేరుతో అలజడి సృష్టించడానికే జగన్ పరామర్శ యాత్రకు వెళ్లారని విమర్శించింది. కులాలను రెచ్చగొట్టేలా అంబటి కామెంట్స్ చేస్తే.. జగన్ ఆజ్యం పోస్తున్నారని మండిపడింది. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి, ఇంటిపై, పార్టీ ఆఫీసుపై జరిగిన దాడిని పరిశీలించడానికి జగన్ చేసిన పరామర్శ యాత్ర.. ఏపీలో మరోసారి పొలిటికల్ హీట్ పెంచింది. వైఎస్ జగన్ గుంటూరు యాత్ర గురించి తెలియడంతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో ఉదయం దాదాపు 11 గంటలకు తాడేపల్లి ఇంటి నుంచి బయల్దేరితే.. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకునే సరికి దాదాపు సాయంత్రం అయింది. అంబటి ఫ్యామిలీని పరామర్శించిన వైఎస్ జగన్.. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు....