AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ పై సుబ్రహ్మణ్యస్వామి కామెంట్లు

విద్యావేత్త, రాజనీతిజ్ణుడు, బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పాజిటివ్ కామెంట్లు విసిరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయ వ్యయాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్ ) తో..

జగన్ పై సుబ్రహ్మణ్యస్వామి కామెంట్లు
Pardhasaradhi Peri
|

Updated on: Sep 03, 2020 | 9:50 PM

Share

విద్యావేత్త, రాజనీతిజ్ణుడు, బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పాజిటివ్ కామెంట్లు విసిరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయ వ్యయాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్ ) తో ఆడిట్ చేయించాలని తాను చేసిన సూచనకు అంగీకరించినందుకు సుబ్రహ్మణ్యస్వామి జగన్ కు థ్యాంక్స్ చేశారు. టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. కాగ్ తో ఆడిటింగ్ చేయించాలన్నది గొప్ప నిర్ణయమని ఆయన ఈ సందర్బంగా అన్నారు. కాగా, 2020–21 నుంచి టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని ఆగస్టు 28న సమావేశమైన టీటీడీ పాలకమండలి తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా, తన ప్రతిపాదనను సీఎం వైఎస్‌ జగన్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పాలకమండలి సభ్యులు గొప్ప మనసుతో సమ్మతించారని సుబ్రహ్మణ్యస్వామి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఏ విషయంపైనైనా సుబ్రహ్మణ్యస్వామి కుండబద్దలు కొట్టడం తెలిసిందే.