అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ లారీ ఢీ..

| Edited By: Jyothi Gadda

Jul 22, 2023 | 6:53 PM

గాయపడిన వారిలో చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు కూడా ఉన్నారు. వీరు హోమ్ సిక్ హాలిడేస్ కు ఇంటికి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. తిరుపతి నుంచి కడపకు వస్తున్న ఆర్టిసి బస్సు, రాజంపేట నుంచి కోడూరు వైపు వెళ్తున్న టిప్పర్ లారీ అతివేగం కారణంగా ఢీకొని సంఘటన జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు.

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ లారీ ఢీ..
Road Accident
Follow us on

కనురెప్ప పాటులో ఆరు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి . అతివేగం వారిని తిరిగిరాని లోకాలకు పంపించేసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం పుల్లంపేట సమీపంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులలో దాదాపు పది మందికి పైగా తీవ్ర గాయాలు కావడంతో వారందరినీ రెండు అంబులెన్స్ లతో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలంలోనే ఆరుగురు చనిపోవడంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో నిండిపోయింది. గాయపడిన వారిలో తిరుపతిలో చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు కూడా ఉన్నారు. వీరు హోమ్ సిక్ హాలిడేస్ కు ఇంటికి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. తిరుపతి నుంచి కడపకు వస్తున్న ఆర్టిసి బస్సు, రాజంపేట నుంచి కోడూరు వైపు వెళ్తున్న టిప్పర్ లారీ అతివేగం కారణంగా ఢీకొని సంఘటన జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..