AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GV Harsha Kumar: మాజీ ఎంపీ హర్షకుమార్ ఇంటికి వెళ్లిన వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్.. పార్టీ మారొచ్చని ప్రచారం..!

మాజీ ఎంపీ హర్షకుమార్‌ను రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కలిశారు. ఈ ఇద్దరి భేటీ ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఆసక్తికరంగా మారింది. హర్షకుమార్ ఇంటికి ఎంపీ బోస్ వెళ్లారు. దీంతో మాజీ ఎంపీ వైఎస్సార్‌సీపీలో చేరతారానే ప్రచారం మొదలైంది.

GV Harsha Kumar: మాజీ ఎంపీ హర్షకుమార్ ఇంటికి వెళ్లిన వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్.. పార్టీ మారొచ్చని ప్రచారం..!
Pilli Subhash Chandra Bose Meet Harsha Kumar
Sanjay Kasula
|

Updated on: Dec 06, 2022 | 12:33 PM

Share

మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ను ఆయన నివాసంలో రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కలవడం చర్చ మొదలైంది. ఇటీవలే కొత్తగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఇచ్చిన పదవిని తిరస్కరించిన హర్షకుమార్. కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉంటుననారు హర్ష కుమార్. అయితే ఇదే విషయాన్ని ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు వివరించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ ఎంపీతో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఎంపీ బోస్‌ మీడియాతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏ అంశంపై చర్చ జరిగిందనేది తెలియలేదు. పార్టీ మారుతారనే చర్చ ఊపందుకుంది.

అయితే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న హర్షకుమార్.. హర్షకుమార్ కాస్త స్పీడ్ తగ్గించారు.. తాజాగా వైసీపీ సుభాష్ చంద్రబోస్‌తో సమావేశం కావడం పెద్ద చర్చకు కారణంగా మారింది. దీంతో పార్టీ మారవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో బోస్‌ కలవడం ఆసక్తికరంగా మారింది.  అయితే ఆయన వైఎస్సార్‌సీపీలో చేరతారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. హర్షకుమార్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారనే ప్రచారం జరిగింది.

ఇదిలా ఉంటే హర్షకుమార్‌తో భేటీపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు.. అయితే బంధువుల సమస్యకు సంబంధించి పాత మిత్రుడు హర్షకుమార్‌ను కలిసినట్లు ఎంపీ బోస్  క్లారిటీ ఇచ్చారట.

మరిన్ని ఏపీ వార్తల కోసం