Vijayawada Bangalore Expressway: విజయవాడ టూ బెంగళూరు ..12 గంటలు కాదు ఇకపై కేవలం 6 గంటల్లోనే..

|

Dec 05, 2022 | 12:14 PM

విజయవాడ, బెంగళూరు మధ్య ప్రయాణం సాగించే వారికి శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. బెంగళూరు, విజయవాడల మధ్య దూరంగా సుమారు 663 కి.మీలు.. సాధారణంగా 11 గంటల 30 నిమిషాల వరకు సమయం పడుతుంది. కానీ త్వరలో అందుబాటులోకి..

Vijayawada Bangalore Expressway: విజయవాడ టూ బెంగళూరు ..12 గంటలు కాదు ఇకపై కేవలం 6 గంటల్లోనే..
Vijayawada Bangalore Expressway
Follow us on

విజయవాడ, బెంగళూరు మధ్య ప్రయాణం సాగించే వారికి శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. బెంగళూరు, విజయవాడల మధ్య దూరంగా సుమారు 663 కి.మీలు.. సాధారణంగా 11 గంటల 30 నిమిషాల వరకు సమయం పడుతుంది. కానీ త్వరలో అందుబాటులోకి రానున్న ఎక్స్‌ప్రెస్‌వేతో ఈ సమయం సగానికి సగం తగ్గనుంది. విజయవాడ – బెంగళూరుల మధ్య ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కోసం నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) ఇప్పటికే బిడ్డింగ్‌లకు ఆహ్వానం అందించింది.

బెంగళూరు – కడప – విజయవాడల మధ్య వెళ్లే ఈ రోడ్డు ద్వారా కేవలం 6 గంటల్లోనే బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్లొచ్చు. ఈ ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణాన్ని రూ. 19,200 కోట్లతో చేపట్టనున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ దీనిపై ఇప్పటికే అంగీకారం తెలియజేశారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే భూసేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ ప్రాజెక్ట్‌ను మొత్తం 14 ప్యాకేజీల్లో పూర్తి చేయనున్నారు. వీటిలో 4 ప్రాజెక్టుల కోసం బిడ్స్‌కు ఆహ్వానించారు. మొత్తం నిర్మాణ ఖర్చులో ఎన్‌హెచ్‌ఏఐ 40 శాతం డబ్బులు ఖర్చు చేస్తుండగా, మిగతా 60 శాతం కంట్రాక్టర్స్‌ ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం భారతమాల పరియోజన్‌ ఫేస్‌2 పథకం కింత చేపట్టనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే కొడికొండ, పులివెందుల, మల్లెపల్లి, వంగపండు, అద్దంకి, చిలకలూరిపేట, గుంటూరు మీదుగా వెళ్లనుంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం పనులు జరిగితే ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే 2025-2026 నాటికి అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..