AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mylavaram: ఇటు బాలయ్య.. అటు వైసీపీ ఎమ్మెల్యే.. వసంత… ఏంది కథా..?

ఇది కేవలం అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీనా..? లేక వసంత మనసు కూడా అటువైపు లాగుతుందా..? గత కొన్నాళ్లుగా ఎమ్మెల్యే వైఖరి అనేక అనుమానాలకు తావిస్తుంది.

Mylavaram: ఇటు బాలయ్య.. అటు వైసీపీ ఎమ్మెల్యే.. వసంత... ఏంది కథా..?
MLA Balayya - Mylavaram MLA Vasantha Venkata Krishna Prasad
Ram Naramaneni
|

Updated on: Jan 12, 2023 | 1:52 PM

Share

వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అర్థరాత్రి నుంచే వేడుకలు మొదలయ్యాయి. అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ.. ఇప్పుడు పొలిటికల్‌ హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు వెలగలేరు గ్రామంలోని అభిమానులు. అందులో వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత‌ కృష్ణ ప్రసాద్, హీరో బాల‌కృష్ణ ఫోటోలతో పాటు అన్న ఎన్టీఆర్ ఫోటో కూడా ప్రింట్ చేయించారు. వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యే, బాలయ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై సర్వత్రా చర్చ జరుగుతుంది.

ఇప్ప‌టికే వైసీపీలోని ఓ వర్గం నాయకులతో అంటీముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఎమ్మెల్యే కృష్ణ ప్ర‌సాద్. మొన్నామధ్య.. . గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టైన ఉయ్యూరు శ్రీనివాస్‌కి  మద్దతుగా కామెంట్స్ చేశారు. అంతేకాదు 10 , 15 మంది చీడ, పీడల వల్లే పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉండాలంటే చుట్టూ పది మంది పోరంబోకుల్ని ఉంచుకోవాలని తీవ్ర కామెంట్స్ చేశారు. ప్రతిపక్షంలో కాదు, స్వపక్షంలో ఉంటూ.. వెన్నుపోటు పొడిచేవారిని సహించేదిలేదని తేల్చి చెప్పారు.

అంతేకాదు వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాస్త గట్టిగానే వాయిస్ వినిపించారు. దీంతో మైలవరం ఎమ్మెల్యేకు జిల్లా నాయకులతోనే పొసగడం లేదా..? లేకుంటే.. అధినాయకత్వంతో కూడా గ్యాప్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..