కనుమ పండుగ రోజు ఆ ఆంధ్రా మంత్రి ఏం చేశారో తెలుసా?

బుధవారం తన పొలంలో వరి చేలకు మందు పిచికారీ చేస్తూ కనిపించిన ఆయన, వ్యవసాయం అంటే తనకు చిన్ననాటి నుండి ప్రత్యేక అభిరుచి ఉందని తెలిపారు. కళాశాల అధ్యాపకుడిగా ఉన్న సమయంలోనూ తన స్వంతంగా వ్యవసాయం నిర్వహించారు. తాజాగా ఆగర్తిపాలెంలోని పొలానికి వెళ్లి సామాన్య రైతులా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

కనుమ పండుగ రోజు ఆ ఆంధ్రా మంత్రి ఏం చేశారో తెలుసా?
Minister Nimmala Ramanaidu

Edited By:

Updated on: Jan 16, 2025 | 10:39 AM

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కనుమ పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే అయిన ఆయన, పండుగ రోజు కొంత తీరిక దొరకడంతో తన సొంత గ్రామానికి వెళ్లారు. ఆగర్తిపాలెంలోని పొలానికి వెళ్లి సామాన్య రైతులా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

బుధవారం తన పొలంలో వరి చేలకు మందు పిచికారీ చేస్తూ కనిపించిన ఆయన, వ్యవసాయం అంటే తనకు చిన్ననాటి నుండి ప్రత్యేక అభిరుచి ఉందని తెలిపారు. కళాశాల అధ్యాపకుడిగా ఉన్న సమయంలోనూ తన స్వంతంగా వ్యవసాయం నిర్వహించి, వరిలో ఎకరానికి 55 నుండి 60 బస్తాల దిగుబడి సాధించిన అనుభవాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

తీరిక సమయం లభించినప్పుడు కూలీలతో కలిసి పొలంలో పని చేయడం నిజమైన సంతృప్తిని ఇస్తుందంటూ మంత్రి చెప్పారు. మంత్రి పదవిలో ఉన్నప్పటికీ, రైతు మట్టి వాసన పట్ల తనకున్న ప్రేమను ఆయన ఈ విధంగా చాటిచెప్పారు. రైతుల జీవితంలో శ్రమతో నిండిన సంతోషాన్ని మళ్లీ అనుభవించడంలో ఎంతో ఆనందాన్ని పొందానని ఆయన అన్నారు. మంచి దిగుబడులే కాకుండా, ఆక్వా సాగులోనూ విజయాలను సాధించిన మంత్రి ప్రయత్నం, వ్యవసాయం పట్ల గౌరవాన్ని చూపించడంలో ఉదాహరణగా నిలిచింది.

వీడియో చూడండి.. 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..