AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఆత్మహత్య చేసుకుందామని వెళ్లారు.. ఒక్కరు మాత్రమే తిరిగొచ్చారు.. అసలు అక్కడ ఏం జరిగింది!

ఏపీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట క్వారీ గంతలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే ఈ ప్రమాదం నుంచి యువతి మాత్రమే బయటపడి.. యువకుడు గల్లంతు కావడంతో ఈ ఘటన మిస్టరీగా మిగిలింది. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra News: ఆత్మహత్య చేసుకుందామని వెళ్లారు.. ఒక్కరు మాత్రమే తిరిగొచ్చారు.. అసలు అక్కడ ఏం జరిగింది!
Srikakulam
T Nagaraju
| Edited By: |

Updated on: May 06, 2025 | 2:37 PM

Share

కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట క్వారీ గంతలో దూకి ఆత్మహత్యకు యత్నించడం శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి స్థానికంగా ఉన్న స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తు అక్కడే జీవనం సాగిస్తోంది. ఆ అమ్మాయికి దాసరిపాలెంకు చెందిన తేజ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తేజ దాసరి పాలెంలోని ఓ ప్రవేటు ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదువుతున్నాడు. అయితే తేజ కాలేజ్‌కు వెళ్లి వచ్చే సమయంలోనే.. ఆ అమ్మాయి కూడా స్పిన్నింగ్ మిల్లుకు వెళ్లి వస్తుండేది. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొంత కాలంగా ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం ఇరువురి పెద్దలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు.

అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో కానీ.. సోమవారం రాత్రి వీరిద్దరూ కలిసి చౌడవరం సమీపంలోని క్వారీ గుంతలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన ఇద్దరిలో అమ్మాయి మాత్రమే తిరిగి వచ్చింది. యువకుడు తేజ మాత్రం ఏమయ్యాడో తెలియడం లేదు. ఈ విషయం కాస్త పోలీసులకు దృష్టికి వెల్లడంతో రంగంలోకి దిగిన పోలీసులు క్వారీ గుంతల్లో తేజ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తేజ మిస్సింగ్‌పై పోలీసులు ఆ యువతిని ప్రశ్నించారు. అయితే ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన ఇద్దరం గుంతలోకి దూకామని..దానిని గమనించిన స్థానికులు తనను కాపాడారని ఆ యువతి చెబుతోంది. అయితే రాత్రి నుంచి ఎంత వెతికినా తేజ ఆచూకీ మాత్రం లభించట్లేదు. దీంతో రాత్రి అక్కడకు వీళ్లిద్దరే వెళ్లారా.. వీళ్లతో పాటు ఇంకెవరైనా వెళ్లారా అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదే కాకుండా ఇక్కడ అమ్మాయిని కాపాడిన వాళ్లు ఎవరూ అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెను కాపాడిన వారు ఎవరని తెలిస్తే..తేజ ఆచూకి లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..