AP News: ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్.. ఏకంగా కంటైనర్లో కిక్కు..!
ఓ మద్యం వ్యాపారి చేసిన పని అందరీన్ని అవాక్కయ్యేలా చేసింది. కంటైనర్లోనే దుకాణం ప్రారంభించాడు. కంటైనర్లో షాపు తెరిచి సేల్ చేస్తుండడంతో ఇక మందుబాబులు కూడా క్యూ కట్టారు. తమకు నచ్చిన బ్రాండ్ను ఎంచుకొని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందో తెలుసా?
విశాఖ జిల్లాలో 155 మద్యం షాపుల కోసం లాటరీ జరిగింది. ఇప్పటికే బుధవారం నుంచి 100 వరకు షాపులు ఓపెన్ అయ్యాయి. మరి కొన్ని ప్రాంతాల్లో గుడి, బడి సమీపంలో నిర్వహణ నిబంధనలకు విరుద్ధం కావడంతో.. ఆల్టర్నేట్ భవనాలు షాపుల కోసం కొంతమంది వ్యాపారులు వేచి చూస్తున్నారు. మరికొందరు ఉన్న షాపులకు ఖాళీ చేయించి వాటిని మద్యం షాపుల కోసం రినోవేట్ చేయిస్తున్నారు. అయితే అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జి సమీపంలో షాపును ఓ మద్యం వ్యాపారి ఏర్పాటు చేయాలనుకున్నాడు. షాపు ఏర్పాటు చేయాలనుకున్న చోట భవనం నిర్మాణంలో ఉంది. దీంతో ఆలస్యం చేయకుండా తనకు ఓ ఐడియా వచ్చింది. కంటైనర్లోనే దుకాణం ప్రారంభించాడు. సరికొత్త మద్యం.. సరికొత్త వెరైటీగా.. కంటైనర్లో షాపు తెరిచి సేల్ చేస్తుండడంతో ఇక మందుబాబులు కూడా క్యూ కట్టారు. తమకు నచ్చిన బ్రాండ్ను ఎంచుకొని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.
విశాఖలో కంటైనర్లో విక్రయిస్తున్న మద్యం షాపు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మందుబాబులు వచ్చి మద్యం కొనుగోలు చేసి ఉత్సాహంగా వెళుతుంటే.. కొంతమంది ఆ కంటైనర్ మద్యం షాపును ఆసక్తిగా తిలకిస్తున్నారు. నిర్వాహకులకు వచ్చిన ఆ స్మార్ట్ ఆలోచన, కంటైనర్ లిక్కర్ షాపుపై చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.