Pawan Kalyan: 28 మంది వైసిపీ ఎంపీలు విఫలం.. పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుందో అంచనాలకు అందడం లేదన్న జనసేనాని

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిధుల సాధనలో ఎందుకింత అలసత్వం ప్రదర్శిస్తున్నారు. జనసేన(జనసేన) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) . 28 మంది ఎంపీలతో వైసీపీ ప్రభుత్వం

Pawan Kalyan:  28 మంది వైసిపీ ఎంపీలు విఫలం.. పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుందో అంచనాలకు అందడం లేదన్న జనసేనాని
Pawan Kalyan On Polavaram
Follow us

|

Updated on: Feb 02, 2022 | 10:01 PM

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పోలవరం ప్రాజెక్ట్(Polavaram Project) నిధుల సాధనలో ఎందుకింత అలసత్వం ప్రదర్శిస్తున్నారు జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) . 28 మంది ఎంపీలతో వైసీపీ ప్రభుత్వం సాధించింది శూన్యమని.. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఉన్న పోలవరానికి 2022-23 బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడ అంటూ ఆయన ప్రశ్నించారు.  22మంది వైసీపీ ఎంపీలు, ఆరుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో ఏం సాధించినట్లని నిలదీశారు. ఈ పరిస్థితి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద పోలవరం ప్రాజెక్ట్ గురించి కనీసం ప్రస్తావిస్తున్నారా లేదా అనే సందేహం కలుగుతోంది అంటూ జనసేనాని సోషల్ మీడియా వేదికగా వైసీపీ సర్కార్ పై అనేక ప్రశ్నల వర్షం కురిపించారు.

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రకటన సమయంలో పోలవరం గురించి అడిగామని అంటారు.. అయితే కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావనే కనిపించడం లేదని.. వైసీపీ ప్రభుతం ఏర్పడిన అనంతరం ఇప్పటి వరకూ కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్ట్ కోసం అందుకున్న నిధులు కేవలం రూ.5163.2 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. ఇలా అయితే ఎప్పటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవుతుంది?..యమునకు ఉప నదులైన కెన్-బెత్వా ప్రాజెక్ట్ కోసం రూ.44వేల కోట్లు ప్రతిపాదనలుఈ సారి కేంద్ర బడ్జెట్లో ఉన్నాయి. దీని బట్టి చూస్తే కేంద్రం జలవనరుల రంగానికి సానుకూలంగా నిధులను కేటాయిస్తోంది. దీని బట్టి చూస్తుంటే.. పోలవరం కు నిధులు రాబట్టడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని జనసేనాని వ్యాఖ్యానించారు.

కేంద్రం దగ్గర రాష్ట్ర అవసరాలను, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను…. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా బహుళార్ధ సాధకమో వివరించి నిధులు తీసుకురావడంలో వైసీపీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే 30.7 లక్షల ఎకరాలకు సాగు అవసరాలు, 28 లక్షల మందికి తాగు అవసరాలు తీరుతాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ ఎంపీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు పవన్ కళ్యాణ్.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అంచనా వ్యయం రూ.47,725 కోట్ల మేరకు పెంచడానికి సాంకేతిక సలహా మండలి అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? నిధుల సాధనలో ఏపీ ప్రభుత్వ అలసత్వ వైఖరి చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరి అంచనాలకు అందడం లేదని చలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.

Read Also:

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ చట్టబద్ధతపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆర్థిక కార్యదర్శి సోమనాథన్.. ఏమన్నారంటే?

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు