AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: 28 మంది వైసిపీ ఎంపీలు విఫలం.. పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుందో అంచనాలకు అందడం లేదన్న జనసేనాని

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిధుల సాధనలో ఎందుకింత అలసత్వం ప్రదర్శిస్తున్నారు. జనసేన(జనసేన) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) . 28 మంది ఎంపీలతో వైసీపీ ప్రభుత్వం

Pawan Kalyan:  28 మంది వైసిపీ ఎంపీలు విఫలం.. పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుందో అంచనాలకు అందడం లేదన్న జనసేనాని
Pawan Kalyan On Polavaram
Surya Kala
|

Updated on: Feb 02, 2022 | 10:01 PM

Share

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పోలవరం ప్రాజెక్ట్(Polavaram Project) నిధుల సాధనలో ఎందుకింత అలసత్వం ప్రదర్శిస్తున్నారు జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) . 28 మంది ఎంపీలతో వైసీపీ ప్రభుత్వం సాధించింది శూన్యమని.. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఉన్న పోలవరానికి 2022-23 బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడ అంటూ ఆయన ప్రశ్నించారు.  22మంది వైసీపీ ఎంపీలు, ఆరుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో ఏం సాధించినట్లని నిలదీశారు. ఈ పరిస్థితి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద పోలవరం ప్రాజెక్ట్ గురించి కనీసం ప్రస్తావిస్తున్నారా లేదా అనే సందేహం కలుగుతోంది అంటూ జనసేనాని సోషల్ మీడియా వేదికగా వైసీపీ సర్కార్ పై అనేక ప్రశ్నల వర్షం కురిపించారు.

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రకటన సమయంలో పోలవరం గురించి అడిగామని అంటారు.. అయితే కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావనే కనిపించడం లేదని.. వైసీపీ ప్రభుతం ఏర్పడిన అనంతరం ఇప్పటి వరకూ కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్ట్ కోసం అందుకున్న నిధులు కేవలం రూ.5163.2 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. ఇలా అయితే ఎప్పటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవుతుంది?..యమునకు ఉప నదులైన కెన్-బెత్వా ప్రాజెక్ట్ కోసం రూ.44వేల కోట్లు ప్రతిపాదనలుఈ సారి కేంద్ర బడ్జెట్లో ఉన్నాయి. దీని బట్టి చూస్తే కేంద్రం జలవనరుల రంగానికి సానుకూలంగా నిధులను కేటాయిస్తోంది. దీని బట్టి చూస్తుంటే.. పోలవరం కు నిధులు రాబట్టడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని జనసేనాని వ్యాఖ్యానించారు.

కేంద్రం దగ్గర రాష్ట్ర అవసరాలను, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను…. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా బహుళార్ధ సాధకమో వివరించి నిధులు తీసుకురావడంలో వైసీపీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే 30.7 లక్షల ఎకరాలకు సాగు అవసరాలు, 28 లక్షల మందికి తాగు అవసరాలు తీరుతాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ ఎంపీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు పవన్ కళ్యాణ్.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అంచనా వ్యయం రూ.47,725 కోట్ల మేరకు పెంచడానికి సాంకేతిక సలహా మండలి అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? నిధుల సాధనలో ఏపీ ప్రభుత్వ అలసత్వ వైఖరి చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరి అంచనాలకు అందడం లేదని చలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.

Read Also:

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ చట్టబద్ధతపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆర్థిక కార్యదర్శి సోమనాథన్.. ఏమన్నారంటే?

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి