AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: వ్యక్తిగత భద్రత విషయంలో హైకోర్టును ఆశ్రయించిన జగన్

కూటమి ప్రభుత్వం కావాలనే టార్గెట్‌ చేస్తోంది. ఓ మాజీ సీఎంకి రిపేర్‌లో ఉన్న వెహికిల్‌ ఇస్తారా...? అంటూ వైసీపీ అధినేత జగన్‌ హైకోర్టును ఆశ్రయించడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

YS Jagan: వ్యక్తిగత భద్రత విషయంలో హైకోర్టును ఆశ్రయించిన జగన్
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌ తారాస్థాయికి చేరాయన్నారు మాజీసీఎం జగన్. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. 100 రోజుల పాలన వైఫల్యాలనుంచి దృష్టి మరల్చేందుకే తిరుమల నెయ్యి కల్తీ జరిగిందని ఓ కట్టు కథ అని చెప్పారు.
Ram Naramaneni
|

Updated on: Aug 05, 2024 | 7:58 PM

Share

తనకు సెక్యూరిటీ పెంచాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్. కూటమి ప్రభుత్వం వచ్చాక తనకు సరిగా సెక్యూరిటీ కల్పించట్లేదని… తనకు కేటాయించిన వాహనం కూడా సరిగా లేదంటూ పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని వైఎస్‌ జగన్‌ పిటిషన్‌లో కోరారు. రిపేర్‌లో ఉన్న బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని తనకు ఇచ్చారంటూ కోర్టుకు కొన్ని ఆధారాలు అందజేశారు. ఇక జగన్‌ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం…త్వరలోనే విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక కావాలనే తనను కూటమి ప్రభుత్వం..  టార్గెట్‌ చేస్తుందని ఫైర్ అయ్యారు జగన్.

జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు హై సెక్యూరిటీ ఉండేది. తాడేపల్లి నివాసం దగ్గర పెద్ద ఎత్తున సెక్యూరిటీ పనిచేసేది. జగన్‌ ఇంటికి వెళ్లే దారిలోనూ చెక్‌ పోస్టులు ఉండేవి. సుమారు 300 మంది రక్షణలో జగన్‌ ఉండేవారు. అయితే ఏపీలో పాలన మారడంతో.. ఆయన సెక్యూరిటీ విషయంలోనూ మార్పులు జరిగాయి. పెద్ద ఎత్తున సెక్యూరిటీని తొలగించారు. దీంతో ప్రైవేట్‌ సెక్యూరిటీని పెట్టుకున్న ఆయన… ప్రభుత్వ తీరుపై నిప్పులు కక్కుతున్నారు. ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నా… కావాలనే తన సెక్యూరిటీ విషయంలో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలన్నారు. ప్రాణహాని ఉన్న అంశాన్ని కూడా పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ… హైకోర్టును ఆశ్రయించారు. మొత్తంగా… సెక్యూరిటీ విషయంలో జగన్‌ హైకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే