AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆడపిల్లలు పుట్టడమే శాపమా?.. గుండెల్ని పిండేస్తున్న ఘటన.. భర్త చనిపోయిన నెలకే..

ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందన్న కారణంగా ఓ వివాహితను అత్తింటివారు ఇంట్లోకి రానివ్వలేదు. ఇప్పటికే మొదటి కాన్పులో ఓ ఆడపిల్ల ఉండగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త ఇటీవల ప్రమాదంలో చినిపోయాడు. భర్త చనిపోయి పుట్టెడు దుఖంలో ఉంటే మరోవైపు రెండో కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారన్న సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారంటూ ఆ బాలింతను అత్తమామలు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో తన ముగ్గురు ఆడపిల్లలతో ఆ తల్లి అత్తింటి ముందు మౌనపోరాటానికి దిగింది.

Andhra Pradesh: ఆడపిల్లలు పుట్టడమే శాపమా?.. గుండెల్ని పిండేస్తున్న ఘటన.. భర్త చనిపోయిన నెలకే..
Prakasham District
Follow us
Fairoz Baig

| Edited By: Srikar T

Updated on: Jul 08, 2024 | 10:29 AM

ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందన్న కారణంగా ఓ వివాహితను అత్తింటివారు ఇంట్లోకి రానివ్వలేదు. ఇప్పటికే మొదటి కాన్పులో ఓ ఆడపిల్ల ఉండగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త ఇటీవల ప్రమాదంలో చినిపోయాడు. భర్త చనిపోయి పుట్టెడు దుఖంలో ఉంటే మరోవైపు రెండో కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారన్న సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారంటూ ఆ బాలింతను అత్తమామలు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో తన ముగ్గురు ఆడపిల్లలతో ఆ తల్లి అత్తింటి ముందు మౌనపోరాటానికి దిగింది.

బాపట్లజిల్లా చీరాల మండలం కొత్తపాలెంకు చెందిన మణికంఠరెడ్డి, కుసుమాంజలి 2021లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. ఈ క్రమంలో మణికంఠరెడ్డి తమ్ముడికి పెళ్ళయింది. తమ్ముడి కోడలు కట్నం తీసుకొచ్చిందని, నీ భార్య కట్నం తీసుకురాలేదంటూ ఇంట్లో అత్తమామలు మణికంఠరెడ్డిని నిలదీయడం ప్రారంభించారు. దీంతో మణికంఠరెడ్డి కూడా భార్యను ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో గొడవలు పెద్దవి కావడంతో విషయం పోలీసులు, పెద్ద మనుషుల వరకు వెళ్ళింది. పెద్ద మనుషుల జోక్యంతో తిరిగి ఇద్దరూ కాపురం చేసుకుంటున్నారు. కుసుమాంజలి మళ్ళీ గర్భం దాల్చింది.. అయితే 20 రోజుల క్రితం మణికంఠరెడ్డి పొలంలో పనిచేస్తూ ట్రాక్టర్‌ కింద పడి ప్రమాదవశాత్తూ చినిపోయాడు. ఆ దుఖం దిగమింగేలోపే కుసుమాంజలికి అత్తమామల నుంచి వేధింపులు మళ్ళీ మొదలయ్యాయి. భర్త చనిపోవడానికి ముందే నిండు గర్భణిగా ఉన్న కుసుమాంజలికి వారం రోజుల క్రిందట డెలివరీ అయింది. ఈ రెండవ కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మనిచ్చింది. దీంతో మొత్తం ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో ఇష్టం లేని అత్తమామలు తనను ఇంటిలోకి రానివ్వడం లేదని కుసుమాంజలి మౌనపోరాటానికి దిగింది. తన కన్నవాళ్ళతో కలిసి అత్తింటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. ముగ్గురు ఆడ పిల్లలు పుట్టారని అత్తమామలు ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఓ వైపు భర్తను కోల్పోయిన కూసుమంజలి పుట్టెడు దుఖంలో ఉండగా, మరోవైపు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని ఇంటిలోనికి రానివ్వకపోవటం ఎంత వరకు సమంజసమని కుసుమాంజలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

జూన్ 21న ఏపీలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం-సీఎం చంద్రబాబు
జూన్ 21న ఏపీలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం-సీఎం చంద్రబాబు
మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా ??
మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా ??
కలెక్టర్ కావాలని ఆశపడ్డ పేద విద్యార్థికి.. అండగా నిలిచిన కమల్..
కలెక్టర్ కావాలని ఆశపడ్డ పేద విద్యార్థికి.. అండగా నిలిచిన కమల్..
అప్పుడు అదృష్టం కలిసిరాలేదు.. ఇప్పుడు విశాల్‌ను పెళ్లి చేసుకుంటూ
అప్పుడు అదృష్టం కలిసిరాలేదు.. ఇప్పుడు విశాల్‌ను పెళ్లి చేసుకుంటూ
సినిమా మాదిరి ప్రేమ కథ! ట్విస్ట్ అండ్ టర్న్స్‌ అబ్బో
సినిమా మాదిరి ప్రేమ కథ! ట్విస్ట్ అండ్ టర్న్స్‌ అబ్బో
OTT సంస్థతో ఒప్పదం.. కట్ చేస్తే నోరెళ్లబెడుతున్న హీరో ఫ్యాన్స్‌
OTT సంస్థతో ఒప్పదం.. కట్ చేస్తే నోరెళ్లబెడుతున్న హీరో ఫ్యాన్స్‌
హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం.. ముక్కు, చేతులకు తీవ్ర గాయాలు..
హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం.. ముక్కు, చేతులకు తీవ్ర గాయాలు..
హీరోగా నా ఎదుగుదలను చూడకుండానే.. వెళ్లిపోయావా అమ్మా..
హీరోగా నా ఎదుగుదలను చూడకుండానే.. వెళ్లిపోయావా అమ్మా..
తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు
తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు
ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? ఇది మీ కోసమే
ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? ఇది మీ కోసమే