AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే 24 గంటల్లో అతి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ IMD హెచ్చరిక!

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి రుతుపవనాల చురుకుగా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు కేరళ వైపుగా నైరుతి రుతుపవనాలు దూసుకొస్తున్నాయి..

వచ్చే 24 గంటల్లో అతి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ IMD హెచ్చరిక!
Heavy Rains In Andhra Pradesh
Srilakshmi C
|

Updated on: May 22, 2025 | 7:10 AM

Share

అమరావతి, మే 22: ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం (మే 21) పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణి ప్రభావతో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి రుతుపవనాల చురుకుగా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

మరోవైపు కేరళ వైపుగా నైరుతి రుతుపవనాలు దూసుకొస్తున్నాయి. బుధవారం రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 52మి.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక ఈ రోజు చకూడా ఏపీలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా, ఎన్టీఆర్, పన్నారు. నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు కురిసే అవకాశం ఉంది.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నిన్న బుధవారం రాత్రి 7 గంటల సమయానికి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 5మిమీ, అనంతపురం జిల్లా చిన్న మూష్టములో 51.5 మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 50మి.మీ, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 48.మిమీ. కృష్ణా జిల్లా గిలకలడిందిలో 17మిమీ, 43 ప్రాంతా ల్లో 30మిమీరు పైగా వర్షపాతం నమోదైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో