AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి.. కొడుకు.. బావమరిది.. ముగ్గురినీ మింగేసిన జీఎన్‌ఎస్‌ఎస్ కాలువ!

నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం వద్ద జీఎన్‌ఎస్‌ఎస్ కాలువలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు, బావమరిది ప్రమాదవశాత్తూ కాలువలో పడి గల్లంతయ్యారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక గజ ఈతగాళ్లతో గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు.

తండ్రి.. కొడుకు.. బావమరిది.. ముగ్గురినీ మింగేసిన జీఎన్‌ఎస్‌ఎస్ కాలువ!
Gnss Canal Tragedy
Balaraju Goud
|

Updated on: Sep 16, 2026 | 10:57 PM

Share

నంద్యాల జిల్లా: జీఎన్‌ఎస్‌ఎస్ కాలువలో ప్రమాదవశాత్తూ పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతైన ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. అవుకు మండలం రామాపురం వద్ద ఉన్న జీఎన్‌ఎస్‌ఎస్ హెడ్ రెగ్యులేటర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. రామాపురం జీఎన్‌ఎస్‌ఎస్ హెడ్ రెగ్యులేటర్ వద్ద ముగ్గురు కాలువలో పడిపోయారు. ప్రమాదంలో అప్రోజ్‌ (30), అతని కుమారుడు ఆరిష్‌ (7), ఆసిఫ్‌ (40) గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. అప్రోజ్‌, ఆరిష్‌ తండ్రి, కొడుకులు కాగా.. ఆసిఫ్‌ అప్రోజ్‌కు వరుసకు బావమరిది అని కుటుంబ సభ్యులు తెలిపారు.

కాలువ వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురూ నీటిలో పడిపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అవుకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

కాలువలో నీటి ప్రవాహం, నీటి లోతు వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గాలింపు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సహకారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. అవసరమైతే ప్రత్యేక గజ ఈతగాళ్ల సహాయం తీసుకునే అవకాశం ఉంది.

ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమారుడితో పాటు బావమరిది గల్లంతవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు, స్థానికులు చేస్తున్న గాలింపు చర్యలపై కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us