AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏషియన్ గేమ్స్‌ నుంచి తెలుగోడు.. వన్డే టీం నుంచి పంత్, పాండ్యా ఔట్.. సెలెక్షన్‌లో 5 హైలైట్స్ ఇవే..!

IND vs AFG: వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టును సెలెక్టర్లు అధికారికంగా ప్రకటించారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న ఈ జట్టులో రోహిత్ శర్మ కొనసాగుతుండగా, తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి ప్రమోషన్ లభించింది. అదే సమయంలో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Venkata Chari
|

Updated on: Sep 16, 2026 | 9:47 PM

Share
వెస్టిండీస్ క్రికెట్ జట్టు (West Indies Cricket Team) తో సెప్టెంబర్ 27 ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ (ODI Series) కోసం భారత క్రికెట్ జట్టు (Team India) ఎంపిక పూర్తయింది. ప్రధాన ఆటగాళ్లు కొందరు ఆసియా క్రీడలు (Asian Games) ఆడేందుకు జపాన్ వెళ్లనున్న నేపథ్యంలో యువ సారథి శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో సరికొత్త కూర్పుతో కూడిన బృందాన్ని ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆలోచనలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. ఇంగ్లండ్ గడ్డపై ప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో అద్భుతమైన శతకం బాదిన రోహిత్ ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటూ మేనేజ్‌మెంట్ ఆయనను కొనసాగించింది.

వెస్టిండీస్ క్రికెట్ జట్టు (West Indies Cricket Team) తో సెప్టెంబర్ 27 ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ (ODI Series) కోసం భారత క్రికెట్ జట్టు (Team India) ఎంపిక పూర్తయింది. ప్రధాన ఆటగాళ్లు కొందరు ఆసియా క్రీడలు (Asian Games) ఆడేందుకు జపాన్ వెళ్లనున్న నేపథ్యంలో యువ సారథి శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో సరికొత్త కూర్పుతో కూడిన బృందాన్ని ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆలోచనలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. ఇంగ్లండ్ గడ్డపై ప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో అద్భుతమైన శతకం బాదిన రోహిత్ ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటూ మేనేజ్‌మెంట్ ఆయనను కొనసాగించింది.

1 / 5
ఇక ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా కనిపించిన ఐదు కీలక పరిణామాలు విశ్లేషకులను ఆకర్షిస్తున్నాయి. మొదటిది రోహిత్ ఎంపిక కాగా, రెండో అంశం స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) లకు చోటు దక్కకపోవడం. పాండ్యా ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో పక్కన పెట్టారు. పంత్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించారు.

ఇక ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా కనిపించిన ఐదు కీలక పరిణామాలు విశ్లేషకులను ఆకర్షిస్తున్నాయి. మొదటిది రోహిత్ ఎంపిక కాగా, రెండో అంశం స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) లకు చోటు దక్కకపోవడం. పాండ్యా ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో పక్కన పెట్టారు. పంత్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించారు.

2 / 5
మూడో అంశం ఏమిటంటే, దేశవాళీ పోటీలలో అదరగొట్టిన ఇద్దరు కొత్త ముఖాలకు భారత జట్టు తలుపులు తెరుచుకున్నాయి. షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ (Sher-e-Punjab T20 League) లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన పంజాబ్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ (Naman Dhir) తొలిసారి వన్డే జట్టు పిలుపును అందుకున్నారు. రెడ్ బాల్ క్రికెట్ వేదికలపై నిలకడగా రాణిస్తున్న జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ (Auqib Nabi) సైతం తొలిసారి భారత వన్డే జట్టులోకి ఎంపికయ్యారు.

మూడో అంశం ఏమిటంటే, దేశవాళీ పోటీలలో అదరగొట్టిన ఇద్దరు కొత్త ముఖాలకు భారత జట్టు తలుపులు తెరుచుకున్నాయి. షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ (Sher-e-Punjab T20 League) లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన పంజాబ్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ (Naman Dhir) తొలిసారి వన్డే జట్టు పిలుపును అందుకున్నారు. రెడ్ బాల్ క్రికెట్ వేదికలపై నిలకడగా రాణిస్తున్న జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ (Auqib Nabi) సైతం తొలిసారి భారత వన్డే జట్టులోకి ఎంపికయ్యారు.

3 / 5
నాలుగో కీలక పరిణామంగా సీనియర్ల పునరాగమనం నిలిచింది. పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj), వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) వన్డే జట్టులోకి తిరిగొచ్చారు. గత ఏడాది రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టుపై శతకం బాదిన తరువాత కూడా జట్టుకు దూరమైన మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కు మళ్లీ అవకాశం దక్కింది.

నాలుగో కీలక పరిణామంగా సీనియర్ల పునరాగమనం నిలిచింది. పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj), వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) వన్డే జట్టులోకి తిరిగొచ్చారు. గత ఏడాది రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టుపై శతకం బాదిన తరువాత కూడా జట్టుకు దూరమైన మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కు మళ్లీ అవకాశం దక్కింది.

4 / 5
ఐదో ప్రధాన మార్పు తెలుగు యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) కి సంబంధించింది. ఆసియా క్రీడల జట్టును వీడిన ఆయన, వెస్టిండీస్‌తో జరిగే వన్డే సమరంలో ఆడనున్నారు. ఆసియా క్రీడల్లో ఆయన స్థానంలో ఎవరు ఆడతారనే అంశంపై స్పష్టత రానప్పటికీ, వన్డే ప్రపంచకప్ సన్నాహాల దృష్టితో ఈ ప్రతిభావంతుడికి ఈ ఫార్మాట్‌లో సత్తా చాటే సువర్ణావకాశం లభించింది.

ఐదో ప్రధాన మార్పు తెలుగు యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) కి సంబంధించింది. ఆసియా క్రీడల జట్టును వీడిన ఆయన, వెస్టిండీస్‌తో జరిగే వన్డే సమరంలో ఆడనున్నారు. ఆసియా క్రీడల్లో ఆయన స్థానంలో ఎవరు ఆడతారనే అంశంపై స్పష్టత రానప్పటికీ, వన్డే ప్రపంచకప్ సన్నాహాల దృష్టితో ఈ ప్రతిభావంతుడికి ఈ ఫార్మాట్‌లో సత్తా చాటే సువర్ణావకాశం లభించింది.

5 / 5
Follow Us