Vijayawada: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు.. భర్తకు దేహశుద్ధి చేసిన మొదటి భార్య.. పోలీసుల ఎంట్రీతో..

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని మనవాడాడు. అంతా సవ్యంగా సాగిపోతుందని, తన కు వచ్చిన ఇబ్బందేమీ లేదని ధీమాగా ఉన్న అతనికి ఊహించని..

Vijayawada: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు.. భర్తకు దేహశుద్ధి చేసిన మొదటి భార్య.. పోలీసుల ఎంట్రీతో..
Marriage
Follow us

|

Updated on: Nov 03, 2022 | 7:21 PM

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని మనవాడాడు. అంతా సవ్యంగా సాగిపోతుందని, తన కు వచ్చిన ఇబ్బందేమీ లేదని ధీమాగా ఉన్న అతనికి ఊహించని షాక్ తగిలింది. తనను పెళ్లి చేసుకుని మరో మహిళతో కలిసి ఉండటాన్ని సహించలేకపోయింది మొదటి భార్య.. తన నుంచి దూరంగా వెళ్లిపోయిన భర్త కోసం అంతటా సెర్చ్ చేసింది. అయినా అతని జాడ దొరకలేదు. ఎప్పుడైనా దొరకకపోతాడా అని ఎదురుచూసిన ఆమెకు ఇవాళ అతను కనిపించాడు. ఇక కోపం ఆపుకోలేకపోయింది. శివాలెత్తిన భద్రకాళిలా విరుచుకుపడంది. మోసం చేసి, తప్పించుకు తిరుగుతున్న భర్తను బంధువులతో కలిసి చితకబాదింది. విజయవాడ పంజా సెంటర్లో ఘర్షణ నెలకొంది. ఓ వ్యక్తి ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని తన భార్యను చేసుకున్నాడు.

మొదటి భార్య కళ్లు గప్పి తిరుగుతున్న ఆ నిత్య పెళ్లి కొడుకు.. ఇవాళ (గురువారం) మొదటి భార్య చేతిలో దెబ్బలు తిన్నాడు. తన భర్త తనను మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడనీ కొన్ని రోజుల క్రితం బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ రోజు భర్త కనిపించడంతో కోపం పట్టలేక బంధువులతో కలిసి దేహశుద్ధి చేసింది. దీనిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన.. ఆ ఘనుడు మొదటి భార్యతో దుర్భాషలాడారడు. మోసం చేశానని పోలీసులకు కంప్లైంట్ చేశావు కదా.. కోర్టులో తేల్చుకుందామని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి