Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Sitrang: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. ఏపీ వైపు దూసుకొస్తున్న సిత్రాంగ్‌ తుఫాన్.. తీరం దాటేది ఎక్కడంటే..?

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు సిత్రాంగ్‌ తుఫాను హెచ్చరికలు హడలెత్తిస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో బెంబేలెత్తిపోయిన జనాన్ని సిత్రాంగ్‌ తుఫాను హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Cyclone Sitrang: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. ఏపీ వైపు దూసుకొస్తున్న సిత్రాంగ్‌ తుఫాన్.. తీరం దాటేది ఎక్కడంటే..?
Cyclone Sitrang
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 20, 2022 | 9:21 AM

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు సిత్రాంగ్‌ తుఫాను హెచ్చరికలు హడలెత్తిస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో బెంబేలెత్తిపోయిన జనాన్ని సిత్రాంగ్‌ తుఫాను హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది అక్టోబర్ 22 కి వాయుగుండంగా మారనుంది. సిత్రాంగ్‌ తుఫాన్ ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాళ్, ఏపీ, తెలంగాణల పై తీవ్రంగా పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు కురువనున్నాయి. సముద్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్టోబర్ 21, 22 తేదీల్లో 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

దీంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాల మధ్య తీరందాటుందన్న ముందస్తు సంకేతాలతో తీరప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. సిత్రాంగ్‌ తుపాను ఎటువంటి బీభత్సాన్ని సృష్టిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అక్టోబర్ 25వ తేదీ నాటికి సిత్రాంగ్‌ తుఫాను పశ్చిమ బెంగాల్‌ దిఘా ప్రాంతంలో తీరం దాటుతుందని అమెరికా గ్లోబల్‌ ఫోర్‌కాస్ట్‌ సిస్టమ్‌ జీఎఫ్‌ఎస్‌ ముందస్తు సమాచారం ప్రసారం విడుదల చేసింది. యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ సంస్థ సిత్రాంగ్‌ తుఫాను బాలాసోర్‌ ప్రాంతంలో తీరం దాటుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ, ఒడిశా, తెలంగాణ, బెంగాల్‌లలో 26, 27 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అయితే.. తుఫాను తీవ్రత, ఎక్కడ తీరాన్ని దాటుతుందన్నదానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. 22న మరిన్ని వివరాలు తెలుస్తాయిని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..