గుడ్న్యూస్.. వచ్చే నెలలో ఏపీలో తగ్గనున్న కరోనా!
సెప్టెంబర్ రెండో వారం నాటికి ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంటువ్యాధుల నిపుణులు(ఎపిడెమాలజిస్ట్లు) చెబుతున్నారు.
Coronavirus in Andhra Pradesh: సెప్టెంబర్ రెండో వారం నాటికి ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంటువ్యాధుల నిపుణులు(ఎపిడెమాలజిస్ట్లు) చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ వ్యాప్తి, ఇన్ఫెక్షన్ రేటు తదితర అంశాలను పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన ఎపిడెమాలజిస్ట్లు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అంటువ్యాధుల నిపుణుల ప్రకారం.. కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రస్తుతం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండగా.. ఆగష్టు 21 తరువాత తగ్గుముఖం పట్టనుంది వారు తెలిపారు. అలాగే అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సెప్టెంబర్ 15 తర్వాత వ్యాధి వ్యాప్తి తగ్గే అవకాశాలున్నాయని వారు వివరించారు. ప్రస్తుతం రోజుకు 70 నుంచి 80 మరణాలు నమోదవుతుండగా.. ఆగష్టు 20 తరువాత 50 కంటే తగ్గే అవకాశాలున్నాయని, అలాగే మరణాల శాతం 0.5శాతం కంటే తగ్గుతుందని వారు చెబుతున్నారు. ఎక్కువ పరీక్షలు చేయడం, ఎక్కువ మందిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడం వల్ల మరణాల నియంత్రణ సాధ్యమవుతుందని ఎపిడెమాలజిస్ట్లు అంటున్నారు. మరోవైపు శనివారం నుంచి సిరోసర్విలేన్స్ భారీగా మొదలు కానున్నట్లు కోవిడ్ 19 ఏపీ కమాండ్ కంట్రోల్ రూమ్ స్పెషలాఫీసర్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సర్వేలో 15 శాతం పైగా హెర్డ్ ఇమ్యూనిటీ గుర్తించినట్లు ఆయన వివరించారు.
Read This Story Also: భార్యకు ప్రేమతో.. నిలువెత్తు మైనపు విగ్రహం..