CM Jagan: నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారాలి.. ఇదే లక్ష్యంతోనే పోలీస్, ఎక్సైజ్‌ శాఖలు కలిసి పని చేయాలన్న సీఎం జగన్

అదే లక్ష్యంతోనే పని చేయాలంటూ పోలీస్, ఎక్సైజ్‌ శాఖలు కలిసి పని చేయాలంటూ సీఎం జగన్ సూచించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

CM Jagan: నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారాలి.. ఇదే లక్ష్యంతోనే పోలీస్, ఎక్సైజ్‌ శాఖలు కలిసి పని చేయాలన్న సీఎం జగన్
CM Jagan Mohan Reddy
Follow us

|

Updated on: Dec 19, 2022 | 4:43 PM

రాష్ట్రంలో ఎక్సైజ్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పనితీరు పైన సోమవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా మారాలని ఆదేశించారు. ఎక్కడా మాదక ద్రవ్యాలు వినియోగం ఉండొద్దు.. ఆ లక్ష్యంతోనే పని చేయాలంటూ పోలీస్, ఎక్సైజ్‌ శాఖలు కలిసి పని చేయాలంటూ ఆయన సూచించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఈబీ సమీక్ష సందర్భంగా.. నార్కొటిక్స్‌తో పాటు అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడం, మరింత సమన్వయంతో సచివాలయాల్లోని మహిళా పోలీస్‌ల పనితీరును మెరుగుపర్చడం, దిశ చట్టం.. యాప్‌లను మరింత పక్కాగా అమలు చేసేలా చూడడం.. ఈ నాలుగింటిపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

ప్రతి కాలేజీ, ప్రతి వర్సిటీలో భారీ హోర్డింగ్స్‌ పెట్టాలన్నారు. ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ను బాగా ప్రచారం చేయాలన్నారు. నార్కొటిక్స్‌పై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు.  రెండు శాఖలు కలిసి వారంలో ఒకరోజు తప్పనిసరిగా సమావేశం కావాలన్నారు.

ఇక నుంచి రెగ్యులర్‌గా ఈ కార్యక్రమాలు జరగాలని దిశా నిర్దేశం చేశారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలన్నారు. ఎక్కడా గంజాయి సాగు జరగకుండా చూడాలన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని.. సచివాలయాల మహిళా పోలీస్‌లనూ సమన్వయం చేయాలన్నారు.

ఇవి కూడా చదవండి

వారిని ఇంకా సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. మరింత సమన్వయంతో సచివాలయాల్లోని మహిళా పోలీస్‌ల పనితీరును మెరుగుపర్చడం, దిశ చట్టం యాప్‌లను మరింత పక్కాగా అమలు చేసేలా చూడాని, ఈ నాలుగింటిపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం