AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: భోగీ రోజు ఏపీలో వినూత్న కార్యక్రమం.. పాల్గొననున్న టీడీపీ, జనసేన అధినేతలు..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నామన్నారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల్లేవని విమర్శించారు.

Chandrababu: భోగీ రోజు ఏపీలో వినూత్న కార్యక్రమం.. పాల్గొననున్న టీడీపీ, జనసేన అధినేతలు..
Pawan Kalyan And Chandra Babu
Srikar T
|

Updated on: Jan 13, 2024 | 10:26 AM

Share

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నామన్నారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల్లేవని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీశాయన్నారు. ప్రతి పేద కుటుంబం పండగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో నాటి తెలుగుదేశం హయాంలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలు ఇచ్చామని గుర్తుచేశారు చంద్రబాబు.

ఈ సంక్రాంతి నుంచి కొత్త క్రాంతి ప్రజల జీవితాల్లో వచ్చేలా మన అడుగులు పడాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అంతా కలుసుకునే సంక్రాంతి పండుగ సమయం కొత్త మార్పుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. సమాజ హితం, రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించి సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. మీ, మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు ఇది సరైన సమయం. రండి! కదలి రండి! రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మేము చేసే పోరాటంలో భాగస్వాములవ్వండన్నారు. చేయి చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దామని చెబుతూ భోగీ, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు.

భోగీ రోజు బాబు, పవన్ ప్రత్యేక కార్యక్రమం..

ఇదిలా ఉంటే జనవరి 14న భోగీ మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొననున్నారు. రాజధాని ప్రాంతంలో వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులను భోగీ మంటల్లో వేసి నిరసన తెలుపనున్నారు. అమరావతి ప్రాంతంలోని రాజధాని గ్రామాల్లో ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో భోగీమంటల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!