
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని పశువుల దప్పిక తీర్చేందుకు ప్రతిగ్రామంలోనూ నీటి తొట్టిలను ఏర్పాటుచేసింది. పెంపుడు జంతువుల విషయంలో వాటి పెంపకందారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాటిని కన్న బిడ్డలమాదిరిగా చూసుకుని సమయానికి ఆహారం, నీరు అందిస్తుంటారు. మరి ప్రకృతిలో సంచరించే ఇతర పక్షుల అవసరాలు ఎవరు తీరుస్తారు. ఈ ఆలోచన చాలామందికి వస్తుంది. అలాంటి ఆలోచన తోనే పిఠాపురంకు చెందిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు లో పక్షులకు చలివేంద్రం ఏర్పాటు చేసింది.
పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గ్రామానికి చెందిన దంగేటి రామకృష్ణ ఇంటి నివాస పరిసరాల్లో వున్న చెట్లకు వరికంకులను ఏర్పాటు చేసి పక్షుల మంచిని అవసరాలకోసం చిన్న చిన్న టబ్స్ లో నీటిని చెట్లకొమ్మలకు వ్రేలాడ దీశారు. ప్రతి ఒక్కరు మూడు మొక్కలను నాటి , పశుపక్ష్యాదులకు అవసరమైన ఆహారం, నీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు సద్గురువు అలీషా. ఇలాంటి కార్యక్రమాల వాళ్ళ పర్యావరణం కు మేలు జరిగటంతో పాటు మానవాళి మనుగడ సాఫీగా సాగేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..