AP News: ఎర్రుపాలెం టూ నంబూర్.. వయా అమరావతి.. రాజధానికి రైలొచ్చేస్తోందోచ్

అమరావతి పునర్నిర్మాణాన్ని సవాల్‌గా తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అందుకోసం పకడ్బందీగా అడుగులు వేస్తోంది. దీంతో అమరావతిపై కాంతి రేఖలు ప్రసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు సెంట్రల్‌ గవర్నమెంట్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

AP News: ఎర్రుపాలెం టూ నంబూర్.. వయా అమరావతి.. రాజధానికి రైలొచ్చేస్తోందోచ్

Updated on: Oct 24, 2024 | 8:52 PM

రాజధాని అమరావతి విషయంలో మరో గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టుకు ఓకే చెప్పింది మోదీ సర్కార్. నేషనల్ రైల్‌ కనెక్టివిటీ పెంచే ఈ రైల్వే లైన్.. అమరావతి అభివృద్ధిలో పడ్డ కీలక అడుగు. కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోద ముద్ర వెయ్యడంతో త్వరలో ఈ రైల్వే లైను నిర్మాణం షురూ కాబోతోంది.

–రూ.2,245 కోట్లతో 57 కి.మీ. రైల్వేలైన్‌ నిర్మాణం

–రైల్వేలైన్‌లో భాగంగా కృష్ణా నదిపై 3.2 కి.మీ. వంతెన

ఇవి కూడా చదవండి

–ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా.. నంబూరు వరకు కొత్త రైల్వే లైన్‌

–చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌తో పాటు.. ఢిల్లీ నగరాలతో అమరావతి రైల్వే లైన్‌ అనుసంధానం

— ఈ రైల్వే లైన్‌తో దక్షిణ, మధ్య, ఉత్తర భారతంతో అనుసంధానం మరింత సులువు కానుంది.

— అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వరస్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు వెళ్లేవారికి సులువైన మార్గంగా ఈ రైలు మార్గాన్ని అభివృద్ధి చేస్తారు.

— మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ కూడా ఈ రైల్వేలైన్‌ ఏర్పాటు కానుంది.

అమరావతికి రైల్వేలైన్‌ మంజూరు కావడంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్ట్ నాలుగేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. అమరావతి నగరాన్ని దేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలనుకున్న మన కల సాకారం కాబోతోందని చెప్పారు.

ఇది చదవండి: దొరికేందోచ్.! మత్తు వదలరా 2లో ఈ అమ్మడు గుర్తుందా.? బయట రచ్చ మాములుగా లేదుగా

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us