AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cannabis Smugglers: విశాఖ ఏజన్సీలో కాల్పులు.. రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. కాల్పులు జరిపిన పోలీసులు..!

Cannabis Smugglers: ప్రకృతి అందాలు.. మంచు దుప్పటితో సహజ అందాలను కలిగిన.. లంబసింగి మన్యంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. స్మగ్లర్లు తెగబడ్డారు...

Cannabis Smugglers: విశాఖ ఏజన్సీలో కాల్పులు.. రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. కాల్పులు జరిపిన పోలీసులు..!
Subhash Goud
|

Updated on: Oct 17, 2021 | 7:43 PM

Share

Cannabis Smugglers: ప్రకృతి అందాలు.. మంచు దుప్పటితో సహజ అందాలను కలిగిన.. లంబసింగి మన్యంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. స్మగ్లర్లు తెగబడ్డారు. గాల్లోకి రాళ్లు రువ్వారు. ఏకంగా పోలీసులకే ఎదుగు తిరిగారు. చివరకు తుపాకులు గర్జించాయి. విశాఖ ఏజెన్సీలో గంజా స్మగ్లర్ల హద్దు మీరి ప్రవర్తించడం కాదు.. ఏకంగా పోలీసులపైనే దాడి చేశారు. గంజాయి స్మగ్లర్లను వెంటాడుతూ.. ఆ ప్రాంతానికి వచ్చిన నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్ళ దాడితో తీవ్ర ప్రతి ఘటన ఎదురైంది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. దాడి నుంచి తప్పించుకువడానికి నల్గొండ పోలీసులు.. ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఏకంగా 10 రౌండ్ల వరకు కాల్పులు జరిగాయి. లంబ సింగి ఘాట్ రోడ్ లో డౌనూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి స్మగ్లర్లు చాకచక్యంగా తప్పించుకున్నారు. వాళ్ల కోసం వేట కొనసాగుతోంది.

అయితే స్మగ్లర్లు పోలీసులపై ఎదురు దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం గాల్లో కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. పోలీసులు కాల్పులు జరపడంతో స్మగ్లర్లు పారిపోయారు. ఇద్దరికి బుల్లెట్‌ గాయాలు అయ్యాయి. బాధితులు గ్రామస్తులు రాంబాబు, కామరాజుగా గుర్తించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

కాగా, ఈ మధ్యకాలంలో గంజాయి స్మగ్లర్ల అగడాలు మరింతగా పెరిగిపోయాయి. పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా గంజాయిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయి స్మగ్లింగ్‌ లేకుండా పోలీసులు అనునిత్యం తనిఖీలు చేపడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో గంజాయి వనాలను పోలీసులు తగులబెట్టారు. అయినా ఇంకా గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు.. గంజాయి ముఠాలను పట్టుకుంటున్నారు.

ఇవీ కూడా చదవండి:

Vizag: వేగంగా దూసుకొచ్చిన కారు.. అనుమానం వచ్చి చెక్ చేసిన పోలీసులు.. షాక్

Andhra Pradesh: వాహనాలకు ఫేక్ స్టిక్కర్లు వేస్తున్నారా..? అయితే మీరు బుక్ అయినట్లే

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం