
Dhulipala Narendra house burglary: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమారు సొంతూరు.. ఆయన తల్లి ప్రమీలా దేవి సొంతవూరులోనే నివసిస్తున్నారు. ప్రమీలా దేవి భర్త ధూళిపాళ్ల వీరయ్య చౌదరి రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబంతో పాటు సంగం డెయిరీ ఛైర్మన్ గా కూడా నరేంద్ర కొనసాగుతున్నారు. ప్రమీలా దేవి ఒక్కరే చింతలపూడిలోని ఇంటి నివసిస్తుండాన్ని దొంగలు గమనించారు. ఎప్పటి నుంచో కన్నేసి అదును కోసం ఎదురు చూశారు.
వారి వేచి ఉన్న రోజు రానే వచ్చింది. ప్రమీలా దేవి కొడుకు నరేంద్ర గుంటూరులో ఉండే ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దొంగలు ఆమె ఇంటికిలో చోరికి ప్లాన్ వేశారు. నిన్న రాత్రి ఇంటిలోకి చొరబడిన దొంగలు ఇంటిలో విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా పట్టుకెళ్లారు. ఉదయాన్నే ఇంటి తలుపులు తొలగించి ఉండటాన్ని గమనించిన పని వాళ్లు వెంటనే ఈ విషయాన్ని ప్రమీలా దేవికి చేరవేశారు. హుటాహుటిన ఆమెను తీసుకొని నరేంద్ర చింతలపూడి చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు రంగంలోకి దిగారు.
చోరికి పాల్పడిన ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం రాత్రి చోరి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇంటి చుట్టు పక్కల ఉన్న సిసి కెమెరా విజువల్స్ ను సేకరించారు. వేలి ముద్రలు తీసుకున్న పోలీసులు ఈ తరహా దొంగతనాలు చేసే వారి గురించి వాకబు చేయడం మొదలు పెట్టారు.
50 తులాల వరకూ బంగారు, 10 కేజీల వరకూ వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు పోయినట్లు భావిస్తున్నారు. ఆమె ఇంటిలోని లేని విషయాన్ని తెలుసుకున్న దొంగలు పక్కాగా చోరి చేయడం వెనుక తెలిసిన వాళ్ల హస్తం ఏమైనా ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే తల్లి ఇంటినే దొంగలు టార్గెట్ చేసి చోరి చేయడం స్థానికంగా కలకలం రేపింది. మరి పోలీసులు దొంగలను పట్టుకుంటారో లేదో వేచి చూడాల్సిందే..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..