AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brutal Murder in Prakasam: యువకుడి దారుణ హత్య.. గొంతు కోసి చంపేశారు.. ఘటనకు సంబంధించి కారణాలు ఇలా..

ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాల మండలంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన శ్రీను అనే యువకుడిని

Brutal Murder in Prakasam: యువకుడి దారుణ హత్య.. గొంతు కోసి చంపేశారు.. ఘటనకు సంబంధించి కారణాలు ఇలా..
uppula Raju
|

Updated on: Jan 18, 2021 | 1:46 PM

Share

ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాల మండలంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన శ్రీను అనే యువకుడిని అదే గ్రామంలో పీర్లచావిడి వద్ద దుండగులు గొంతుకోసి కిరాతకంగా హత్యచేశారు. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మండ్ల రంగయ్య, వెంకట లక్ష్మమ్మల మూడో కుమారుడు శ్రీను(22). శనివారం రాత్రి పీర్లచావిడి వద్ద ఉన్నారు.

అతని సోదరుడు వెంకటేశ్వర్లు ఇంటికి రమ్మని పిలవడంతో తాను తర్వాత వస్తానని చెప్పి అక్కడే ఉండిపోయాడు. ఆదివారం వేకువజామున పీర్లచావిడి సమీపంలో ఉన్న నీటి ట్యాంకు వద్దకు వచ్చిన కొందరు రక్తపుమడుగులో పడి ఉన్న శ్రీను మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఒంగోలు నుంచి క్లూస్‌టీం సిబ్బంది, డాగ్‌ స్క్వాడ్‌ రప్పించి ఆధారాల కోసం వెతికారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పూట మద్యం తాగి గొంతు కోసి కడతేర్చి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేపట్టారు.

తమిళనాడులో దారుణం.. జర్నలిస్టును నరికి చంపిన దుండగులు.. రియల్ ఏస్టేట్ వ్యవహారమే కారణమా..?

హత్యాయత్నంపై స్పందించిన పేర్ని నాని, కృష్ణా జిల్లా ఎస్పీ.. నిందితుడు అందుకే దాడి చేశాడట