చిత్తూరులో పరువు హత్య కలకలం..!

చిత్తూరు జిల్లాలో పరువు హత్య సంచలనం రేపింది. దళితుడిని ప్రేమించి పెళ్లాడిందంటూ పగబట్టి కూతుర్ని చంపిన తండ్రి ఘటన.. పలమనేరు రూరల్ మండలం ఊసర పెంటలో చోటుచేసుకుంది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఏడు రోజులకే.. కన్న తండ్రి చేతిలో హతమైన కూతురు. రెండున్నరేళ్ల క్రితం గ్రామానికి చెందిన దళితుడుడైన కేశవులను పెళ్లిచేసుకున్న హేమావతి. ఈ క్రమంలో హేమావతి మగబిడ్డకు జన్మనిచ్చి తిరిగి గ్రామానికి చేరుకుంది. ఆమె తమ ఊరికిస్తే ఎక్కడ తన పరువు పోతుందోనన్న కసితో హత్య […]

చిత్తూరులో పరువు హత్య కలకలం..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 29, 2019 | 10:55 AM

చిత్తూరు జిల్లాలో పరువు హత్య సంచలనం రేపింది. దళితుడిని ప్రేమించి పెళ్లాడిందంటూ పగబట్టి కూతుర్ని చంపిన తండ్రి ఘటన.. పలమనేరు రూరల్ మండలం ఊసర పెంటలో చోటుచేసుకుంది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఏడు రోజులకే.. కన్న తండ్రి చేతిలో హతమైన కూతురు. రెండున్నరేళ్ల క్రితం గ్రామానికి చెందిన దళితుడుడైన కేశవులను పెళ్లిచేసుకున్న హేమావతి. ఈ క్రమంలో హేమావతి మగబిడ్డకు జన్మనిచ్చి తిరిగి గ్రామానికి చేరుకుంది. ఆమె తమ ఊరికిస్తే ఎక్కడ తన పరువు పోతుందోనన్న కసితో హత్య చేశాడు తండ్రి భాస్కర్ నాయుడు. హేమావతి మృతితో తల్లిఒడికి దూరమైన 7 రోజుల పసికందు. దీంతో.. గ్రామస్తులు తండ్రి భాస్కర్ నాయుడు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈ పరువు హత్యతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఎంటర్‌ అయి నిందితుడు భాస్కర్ నాయుడి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.