AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: అనకాపల్లి జిల్లాలో షాకింగ్ ఘటన.. గన్‌తో బెదిరించి పట్టపగలు బ్యాంకులో చోరీ

అనకాపల్లిలోని నర్సింగపల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో చోరీకి పాల్పడ్డారు దుండగుడు. పట్టపగలు సిబ్బందిని గన్‌తో బెదిరించి నగదు దోచుకెళ్లాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

AP: అనకాపల్లి జిల్లాలో షాకింగ్ ఘటన.. గన్‌తో బెదిరించి పట్టపగలు బ్యాంకులో చోరీ
Bank Robbery
Ram Naramaneni
|

Updated on: Apr 30, 2022 | 5:46 PM

Share

Anakapalle: అనకాపల్లి జిల్లాలో  పట్టపగలు బ్యాంకులో జరిగిన దోపిడీ ఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో కసింకోట మండలం నర్సింగపల్లిలోని ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో చొరబడిన దుండగుడు తుపాకీతో క్యాషియర్‌ను బెదిరించాడు. అతని వద్ద ఉన్న రూ.3.30లక్షలు లాక్కొని ఎస్కేప్ అయ్యాడు. సినీ స్టైల్లో జరిగిన ఈ ఘటనతో బ్యాంకు సిబ్బందితో పాటు కస్టమర్స్ షాక్ తిన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. దోపిడీకి పాల్పడిన వ్యక్తి కస్టమర్‌లా బ్యాంక్‌లోకి ఎంటరయ్యాడు. ఫేస్ కనిపించకుండా హెల్మెట్‌ పెట్టుకున్నాడు. బ్యాగ్‌ తగిలించుకుని ఉన్నాడు. దోపిడీ సమయంలో నిందితుడు బెదిరించిన విజువల్స్, పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Also Read: Electricity bill: ఎండాకాలంలో కరెంటు బిల్లు వాసిపోతుందా.. తగ్గడానికి ఈ టిప్స్ పాటించండి!