
ఏపీ పోలీసులు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. నేరాలకు పాల్పడుతున్న నిందితులకు వెరైలటీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల చిత్తూరులో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను చేతులకు సంకెళ్లు వేసి కోర్టు దాకా నడిపించుకుంటూ వెళ్లి వారికి పోలీసులు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. తాజాగా టెంపుల్ సిటీ తిరుపతిలోనూ ఇద్దరు రౌడీ షీటర్స్కు ఇదే తరహా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆదివారం తిరుపతిలోని టీవీఎస్ షోరూం సర్కిల్ వద్ద రోడ్డుపై కత్తి తో హల్చల్ చేసిన రౌడీ షీటర్ తో పాటు అతని స్నేహితున్ని అరెస్టు చేసిన ఈస్ట్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసారు. అనంతరం ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
విక్టరీ వైన్ షాపు వద్ద కత్తులతో హల్ చల్ చేసి భయాందోళనకు గురి చేసిన రౌడి షిటర్ ఫిరోజ్, సయ్యద్ భాషల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ఇద్దరు యువకుల్ని అదుపులో తీసుకున్నారు. వారిపై మారణాయుధాలు వాడకంతో పాటు ఇతర సెక్షన్స్ల కింద కేసు నమోదు చేసి.. ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు ప్రాంగణం వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అందరూ చూసేలా చేతులకు బేడీలు వేసి రోడ్డుపై నడుచుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరు పరిచారు.
నేరం చేస్తే అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తే ఇలాంటి శిక్ష తప్పదని తెలియజేశారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర నడిపించగా నిందితుల్ని జనం ఆసక్తిగా చూశారు. ఈ చర్యతో సమాజంలో భయ బ్రాంతులు సృష్టించే వారిపట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. ఇక ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇద్దరు నిందితులకు ఈనెల 16 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.