AP: సర్పంచ్ బండి రమేష్ పాడే మోసిన మంత్రులు.. కుటుంబ సభ్యులకు ఓదార్పు..

| Edited By: Sanjay Kasula

Apr 13, 2022 | 2:15 PM

Sarpanch Bandi Ramesh: బుధవారం జరిగిన సర్పంచ్ అంతిమ యాత్రలో మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని పాల్గొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

AP: సర్పంచ్ బండి రమేష్  పాడే మోసిన మంత్రులు.. కుటుంబ సభ్యులకు ఓదార్పు..
Follow us on

కృష్ణా జిల్లా… గూడూరులో మంత్రి జోగి రమేష్(Ministers Jogi Ramesh ) ఊరేగింపులో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గూడూరు మండలం కొకనారాయణపాలెం గ్రామ సర్పంచ్ బండి రమేష్… మంత్రికి స్వాగతం పలికి అనంతరం ఊరేగింపులో పాల్గొన్నారు. మధ్యలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే సర్పంచ్ కుప్పకూలిపోయారు. రమేష్‌కు చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రాణాలు కాపాడలేక పోయారు. అయితే బుధవారం జరిగిన సర్పంచ్ అంతిమ యాత్రలో మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని పాల్గొన్నారు. అంతే కాదు పాడేను మోశారు మంత్రులు. అంతకు ముందు అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి వెన్నంటి ఉంటాయని ధర్యం చెప్పారు.

నిన్న ఏం జరిగిందంటే..

మంత్రి ఊరేగింపులో కూడా సందడి చేశాడు. అంతలోనే అకస్మాత్తుగా అసువులు బాశాడు. కృష్ణా జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది.  గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. గూడూరు మండలం కొకనారాయణ పాలెం(Kokanarayanapalem) గ్రామ సర్పంచ్ బండి రమేష్(Bandi Ramesh) గుండెపోటుతో కన్నుమూశారు. మంత్రి జోగి రమేష్‌కి దండవేసిన అనంతరం ఊరేగింపుతో వస్తుండగా ఆకస్మికంగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే కుప్పకూలిపోయారు.

దీంతో మంత్రి వెంటనే ఆయన్ను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుచరులకు సూచించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. బండి రమేశ్ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కొకనారాయణ పాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సర్పంచ్  మరణించాడని తెలిసి మంత్రి కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అతనితో తనకు ఎంతో బాండింగ్ ఉందని వెల్లడించారు. బండి రమేశ్ కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.

ఇవి కూడా చదవండి: Pranahita Pushkaralu: ఇవాళ్టి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు.. మధ్యాహ్నం తర్వాత నదిలోకి పుష్కర పురుషుడు..

Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..