AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఇది కదా పండుగలాంటి వార్త.. ప్రభుత్వ ఉద్యోగులు బీ అటెన్షన్.. పూర్తి వివరాలు ఇవిగో

పంచాయితీ రాజ్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఆ శాఖలోని సిబ్బందికి భారీ స్థాయిలో పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వివరాలు ఏంటో.. మనం ఈ ఆర్టికల్ లో ఓ సారి లుక్కేయండి మరి.

Andhra: ఇది కదా పండుగలాంటి వార్త.. ప్రభుత్వ ఉద్యోగులు బీ అటెన్షన్.. పూర్తి వివరాలు ఇవిగో
Ap Govt
Ravi Kiran
|

Updated on: Nov 03, 2025 | 11:58 AM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఉద్యోగులకు శుభవార్త అందించింది. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి భారీస్థాయిలో పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసినవారికే ప్రమోషన్ అర్హత ఉండగా ఇప్పుడు ఆ కాలాన్ని ఏడాదికి తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 మందికి పైగా పంచాయతీ కార్యదర్శులు సీనియర్ అసిస్టెంట్లు పదోన్నతులు పొందనున్నారు. వీరిలో సుమారు 660 మందికి డిప్యూటీ ఎంపీడీవో హోదా ఇవ్వనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రతిపాదనను ఆమోదించడంతో మార్గం సుగమమైంది.

ప్రభుత్వ నిర్ణయంతో రెండు సంవత్సరాల సర్వీస్ రూల్ తొలగించబడింది. దీనివల్ల పదోన్నతులు నిలిచిపోయిన అనేకమంది ఉద్యోగులు ఇప్పుడు పై హోదాలకు ఎదగనున్నారు. గ్రామ సచివాలయాల పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో డిప్యూటీ ఎంపీడీవోలను నియమించాలనే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఈ ఖాళీలను భర్తీ చేయడానికి పంచాయతీ కార్యదర్శులను ప్రమోట్ చేస్తోంది. ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. తాము చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకుంది అని పలువురు పేర్కొన్నారు. ప్రమోషన్‌లు ఇవ్వడంతో శాఖలో సిబ్బంది కొరత తగ్గి, పనితీరు మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా సాగుతాయని వారు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పంచాయతీరాజ్ శాఖకు కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. సిబ్బందిలో నూతన ఉత్సాహం, విశ్వాసం కలిగించిందని పంచాయతీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.