AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather Alert: రాగల మూడురోజులు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఎలాఉంటుందంటే..

AP Weather Alert: అల్పపీడన ద్రోణి బలహీన పడిందని, దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి..

AP Weather Alert: రాగల మూడురోజులు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఎలాఉంటుందంటే..
Rains
Shiva Prajapati
|

Updated on: Jul 04, 2021 | 4:58 PM

Share

AP Weather Alert: అల్పపీడన ద్రోణి బలహీన పడిందని, దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులకు సంబంధించి వాతావరణ నివేదికను అధికారులు ప్రకటించారు. ఈ రిపోర్ట్స్ ప్రకారం.. ఇవాళ, రేపు ఉత్తరకోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి(మంగళవారం) ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్రాలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం నాడు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమ ప్రాంతంలోనూ ఇంచుమించు ఇదేమాదిరిగా వాతావరణ పరిస్థితులు ఉంటాయన్నారు. ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. మంగళవారం నాడు మాత్రం ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయని వెల్లడించారు. ఉరుములు, మెరుపు వచ్చే సమయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. సురక్షితమైన ప్రాంతాల్లో తలదాచుకోవాలన్నారు.

Also read:

Rakul Preet Singh: రకుల్‏కు సర్‏ఫ్రైజ్ గిఫ్ట్ పంపిన బాలీవుడ్ హీరో.. కానుకను సోషల్ మీడియాలో షేర్ చేసిన హీరోయిన్..

Karivena Satram : శ్రీశైల పుణ్యక్షేత్రంలో కరివేన సత్రానికి వైభవంగా భూమిపూజా కార్యక్రమం

YSRCP: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి..