IIIT Student Suicide: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. హస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరిపెట్టుకుని..

|

Sep 20, 2023 | 6:57 AM

ఈ మధ్యకాలంలో విద్యార్ధుల బలవన్మరణాలు మరింత ఆందోళనకరంగా మారాయి. చదువుల ఒత్తిడి చిత్తు చేయడమే అందుకు కారణం. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న లేత కుసుమాలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నా్యి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్ధి మరణం కలకలంగా మారింది. విద్యార్ధి తన హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని..

IIIT Student Suicide: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. హస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరిపెట్టుకుని..
Sudent Gangaram
Follow us on

వేంపల్లె, సెప్టెంబర్‌ 20: ఈ మధ్యకాలంలో విద్యార్ధుల బలవన్మరణాలు మరింత ఆందోళనకరంగా మారాయి. చదువుల ఒత్తిడి చిత్తు చేయడమే అందుకు కారణం. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న లేత కుసుమాలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నా్యి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్ధి మరణం కలకలంగా మారింది. విద్యార్ధి తన హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలీలైన తల్లిదండ్రులు ఎండలో చాకిరీ చేసి కుమారుడిని పెద్ద చదువులు చదివిస్తూ మురిసిపోయారు. కానీ చేతికందొచ్చిన కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో గుండెలవిసేలా విలపిస్తున్నారు. పోలీసులు, తోటి విద్యార్థుల కథనం ప్రకారం..

లింగాల మండలం తేర్నాంపల్లె హరిజనవాడకు చెందిన నారాయణమ్మ, గంగాధర అనే దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గంగారాం, చిన్న కుమారుడు గౌరీకుమార్‌లు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ నారాయణమ్మ, గంగాధర దంపతులు కుమారులను చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు గంగారాం (21) వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ మూడో ఏడాది చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ గంగారాం ట్రిపుల్‌ ఐటీలోని తన హాస్టల్‌ గదిలో మంగళవారం (సెప్టెంబర్‌ 19) ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించాడు.

హాస్టల్‌లోని తోటి విద్యార్థులు గంగారాం గది తలుపులు కొట్టినా ఎంతకూ తీయలేదు. దీంతో విద్యార్ధులు కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. హాస్టల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం విద్యార్ధి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్‌, సీఐ గోవిందరెడ్డితోపాటు తదితరులు ఆసుపత్రిలో విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. విద్యార్ధి గదిలో ఎటువంటి సూసైడ్‌ లెటర్‌ లభ్యంకాలేదని.. కేసు దర్యాప్తులో ఉందని మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.