AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో రెచ్చిపోయిన మరో టీడీపీ నేత.. మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్న అశోక్ గజపతి రాజు.. వీడియో వైరల్..

|

Mar 08, 2021 | 4:22 PM

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు శృతిమించి ప్రవర్తిస్తున్నారు. మద్దతుగా వచ్చిన వారినే మడతపెట్టి మరీ కొడుతున్నారు.

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో రెచ్చిపోయిన మరో టీడీపీ నేత.. మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్న అశోక్ గజపతి రాజు.. వీడియో వైరల్..
Follow us on

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు శృతిమించి ప్రవర్తిస్తున్నారు. మద్దతుగా వచ్చిన వారినే మడతపెట్టి మరీ కొడుతున్నారు. మహిళా దినోత్సవం రోజునే కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు ఓ మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది. పూర్తి వివరాల్లోకెళితే.. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ సమీపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు విజయనగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గజపతిరాజు వెంట టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. అయితే, ఓ మహిళా కార్యకర్త తమ అభిమాన నేత వచ్చాడనే సంతోషంలో అశోక్ గజపతి రాజుపై పుష్పాలు జల్లింది. అయితే, పక్కనే ఉన్న మరో మహిళా కార్యకర్త ఆమెను వారించింది.

ఆ సమయంలోనే సహనం కోల్పోయిన అశోక్ గజపతి రాజు సదరు మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ఆమె చేతిలో ఉన్న పుష్పాలను కింద పడేసి ఆమెను కొట్టారు. ఆ ఘటనను చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. కేంద్ర మంత్రిగా పని చేసిన వ్యక్తి ఓ మహిళపై చేయి చేసుకోవడం ఏంటి? అది కూడా సొంత పార్టీ కార్యకర్తను కొట్టడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. కాగా, అశోక్‌ గజపతి రాజు చేయి చేసుకోవడంతో సదరు టీడీపీ మహిళా కార్యకర్త వెనక్కి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇదిలాఉంటే.. ఇటీవలే టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ టీడీపీ కార్యకర్త చెంప చెల్లుమనిపించిన విషయం తెలిసిందే.

Also read:

Director Sukumar : ఆ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాలో కచ్చితంగా తెలుగమ్మాయే హీరోయిన్.. ఎందుకో తెలుసా..?

Sreekaram Movie : శ్రీకారం వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి.. ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్..

Bengal Polls: బీజేపీ ఆకర్ష్‌కు భారీ స్పందన.. తృణమూల్ గూడు వీడుతూ దీదీకి పంచ్‌లిస్తున్న నాయకులు