Farmers: రైతులకు ఇదే లాస్ట్ ఛాన్స్.. మార్చి 31లోగా ఈ పని చేస్తే అకౌంట్లోకి రూ.6 వేలు..
ఏపీ రైతులకు చివరి ఛాన్స్. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్నదాత సుఖీభవ డబ్బులను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 46.85 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,675 కోట్లు విడుదల చేసింది. ఇవి మీకు అందకపోతే మార్చి 31లోగా ఈ పని చేయండి

ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్. కూటమి సర్కార్ గత కొద్ది రోజుల క్రితం జమ చేసిన అన్నదాత సుఖీభవ డబ్బులు మీ అకౌంట్లో పడలేదా..? మీకు అర్హత ఉన్నా బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కాలేదా..? అయితే మీరు మార్చి 31వ తేదీలోపు ఈ పని చేస్తే మీకు సొమ్ము వచ్చేస్తాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ పథకం కింద ఏడాదికి రూ.20 వేల చొప్పున మూడు విడతలుగా ప్రభుత్వం జమ చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత క్రింద రూ.6 వేలు జమ చేసింది. అయితే కొన్ని సమస్యల వల్ల కొంతమంది రైతులు నిధులు అందుకోలేదు. అలాంటివారు ఈ పనులు చేయడం వల్ల మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఏం చేయాలనేది వివరంగా తెలుసుకోండి.
వీరికి డబ్బులు కట్
ఈకేవైసీ పూర్తి చేయని రైతులు, భూమికి ఆధార్ లింకింగ్ లేకపోవడం, ఎన్పీసీఐ యాక్టివ్గా ఉండకపోవడం, మైనర్ పేరిట భూములు, భూమి యజమాని మరణించినా రికార్డుల్లో పేరు మార్చకపోవడం, వారసులకు కొత్త పుస్తకాలు జారీ కాకపోవడం, వెబ్ ల్యాండ్ వివరాల్లో తప్పులు, 1బీ, ఆధార్లో పేర్లు వేర్వేరుగా ఉండటం, గుడి లేదా సంస్థ పేరుపై భూమి ఉండటం, జాయింట్ అకౌంట్లో ఆధార్ సీడింగ్ లేకపోవడం, పొలంలో ఇళ్లు లేదా అక్వా సాగు చేయడం, కోర్ట్ కేసులు, వారసత్వ గొడవలు వంటి కారణాలతో అన్నదాత సుఖీభవ నిధులు నిలిచిపోతాయి.
ఏం చేయాలి..?
రైతు సేవా కేంద్రం లేదా వ్యవసాయ కార్యదర్శిని సంప్రదించాలి. ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ వంటివి అందించాలి. సమస్య ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. మీ సమస్యను పరిష్కరించుకుంటే మార్చి 31లోపు మీకు నిధులు జమ అవుతాయి.
స్టేటస్ చెక్ చేస్కోండి..
-https://annadathasukhibhava.ap.gov.in/ పోర్టల్లోకి వెళ్లండి
-మీ స్టేటస్ తెలుసుకోండి అనే ఆప్షన్ ఎంచుకోండి
-మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
-క్యాప్చా ఎంటర్ చేయండి
-సెర్చ్ బటన్ ప్రెస్ చేయండి
-రైతు వివరాలు, బ్యాంక్ అకౌంట్, పేమెంట్ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి
పీఎం కిసాన్ స్టేటస్ చూస్కోండి
రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపచేస్తోంది. దీంతో పీఎం కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు జమ అయ్యాయి. పీఎం కిసాన్ నిధులు అందకపోతే పీఎం కిసాన్ వెబ్ సైట్లోకి వెళ్లి స్టేటస్ చేక్ చేస్కోండి.
