Andhra Pradesh: నిప్పుల గుండం తొక్కేందుకు మహిళా భక్తుల పోటీ.. ఎందుకంటే..?

Andhra Pradesh: దేవుడికి సంబంధించి ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు.. కొన్నిసార్లు అగ్నిగుండాలను ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు.

Andhra Pradesh: నిప్పుల గుండం తొక్కేందుకు మహిళా భక్తుల పోటీ.. ఎందుకంటే..?

Updated on: Feb 09, 2022 | 4:24 PM

Andhra Pradesh: దేవుడికి సంబంధించి ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు.. కొన్నిసార్లు అగ్నిగుండాలను ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు. అగ్నిగుండాలను దాటడం ద్వారా పాపాలు తొలగిపోతాయని, అంతా మంచి జరుగుతుందనే భావన జనాల్లో ఉంటుంది. అందుకే.. ఏ ఉత్సవాల్లోనైనా, దేవుడికి సంబంధించిన సంబరాల్లోనైనా అగ్ని గుండాలను ఏర్పాటు చేస్తే జనాలు ఆ నిప్పుల గుండం నుంచి దాటుతారు. అయితే చాలామటుకు మగవాళ్లు అగ్ని గుండాలను దాటేందుకు ఆసక్తి చూపుతారు. మహిళలు కూడా అగ్నిగుండాలు దాటుతారు. కానీ చాలా అరుదు అనే చెప్పాలి. అయితే, ఇక్కడ మాత్రం నిప్పుల గుండ తొక్కేందుకు మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.

వివరాల్లోకెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వీరభద్రేశ్వర స్వామి ఆలయ శత వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు నిప్పుల గుండం ఏర్పాటు చేశారు. రధసప్తమి రాత్రి నిప్పులు గుండం ఏర్పాటు చేయడంతో మహిళలు, భక్తులు భారీగా పాల్గొన్నారు. ఎర్రని నిప్పులపై నడిచారు. శరభ శరభ అంటూ భక్తులు నిప్పుల గుండం తొక్కారు. స్వామి వారి మహిమ వల్ల నిప్పులపై నడిచినా ఏమీ కాదని భక్తులు చెబుతున్నారు. అయితే, ఈ నిప్పుల గుండంపై ఎక్కువ మంది మహిళలు ధైర్యంగా నడిచారు. ఇలా నిప్పుల గుండం పై నడిచి స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.

Also read:

ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేసేవారికి గుడ్‏న్యూస్.. అందులో ప్రోఫైల్ క్రియేట్ చేస్తే ఛాన్స్ మీ వద్దకే.!!

సలలిత రాగసుధారసాన్ని పంచిన సుస్వరాల సుసర్ల.. లతాను తెలుగువారికి పరిచయం చేసింది ఆయనే!

SEBI Officer Grade A 2022: ఫిబ్రవరి 20న జరగనున్న సెబీ 2022 గ్రేడ్‌ ఏ పరీక్షకు హాల్‌ టికెట్లు విడుదల..

Loading...
Unable to load recommendations.
Follow Us